ట్రిపుల్ ఆర్ గురించి ఏ వార్త వచ్చినా సెన్సేషనే. చిన్నవార్త కూడా పెద్దదిలా కనిపిస్తోంది. తొలి పాన్ ఇండియా హిట్ బాహుబలి 2 తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడమే ఇందుకు కారణం. సినిమా గురించి లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఆసక్తి రేపుతోంది. ఇద్దరు సూపర్ స్టార్స్ ట్రిపుల్ ఆర్ కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. 

 

400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ రిలీజ్ కోసం.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ నటిస్తున్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అజయ్ దేవగణ్ పక్కన హీరోయిన్ గా శ్రియ పేరు వినిపిస్తున్నా.. చిత్ర యూనిట్ ఇంతవరకు కన్ఫార్మ్ చేయలేదు. లేటెస్ట్ గాసిప్ ప్రకారం.. అమితాబ్ బచ్చన్.. మహేశ్ ట్రిపుల్ ఆర్ కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారట.  

 

ట్రిపుల్ ఆర్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలతో పాటు.. హిందీలో రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్ కు అమితాబ్.. తెలుగు వెర్షన్ కు మహేశ్ తో వాయిస్ చెప్పిస్తారని తెలిసింది. తమిళం.. కన్నడం...మలయాళంలో ఎవరు చెప్పేది ఇంకా డిసైడ్ అవ్వలేదట. మరో సూపర్ స్టార్ రజినికాంత్ తమిళ వెర్షన్ కు వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందట.

 

మహేశ్ బాబు ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వాయిస్ ఇచ్చిన తొలి చిత్రం జల్సా హిట్ అయింది. దూకుడు హిట్ తర్వాత శ్రీనువైట్ల అడగడంతో.. ఎన్టీఆర్ బాద్షాకు వాయిస్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆబ్లిగేషన్ కోసం.. అక్క మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది సినిమాకు.. కృష్ణ నటించిన శ్రీశ్రీ మూవీకి వాయిస్ ఇచ్చాడు మహేశ్. మొత్తానికి రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. వాయిస్ ఓవర్ మహేశ్, అమితాబ్ ఇస్తున్నారనే వార్తలు చెలరేగడంతో సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: