టాలీవుడ్ సినిమా పరిశ్రమకు లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి అప్పట్లోనే మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత నుండి వరసగా అవకాశాలు అందుకున్న కాజల్, అనతికాలంలోనే ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోని దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి క్రేజ్, పేరు తెచ్చుకుంది. ఇక ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన సీత అనే సినిమా ద్వారా మంచి ఛాలెంజింగ్ రోల్ లో నటించిన కాజల్, ప్రస్తతం కమల్ హాసన్, శంకర్ ల ప్రతిష్టాత్మక సినిమా ఇండియన్ 2 లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. 

 

అయితే కాజల్ గురించిన విషయం ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో సంచలనం రేపింది. అదేమిటంటే, కొద్దిరోజుల క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో తనకు మేకప్ లేకుండా ఉన్న సహజమైన తన ముఖంతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి, పెద్ద సంచలనానికి తెరలేపింది. నిజమైన అందం అనేది మనసుకి సంబంధించింది అని, బాహ్య సౌందర్యం అనేది కేవలం అశాశ్వతం అని, అందుకే మేకప్ లేకుండా తన ముఖాన్ని ప్రేక్షకులకు చూపించడానికి తాను ఏ మాత్రం సిగ్గు పడను అని తన పోస్ట్ లో చెప్పుకొచ్చింది కాజల్. అయితే కాజల్ చేసిన ఈ సాహసోపేతమైన పనికి ఎందరో ప్రేక్షకుల శభాష్ కాజల్

 

నిజంగా హీరోయిన్స్ ఎక్కువగా మేకప్ తో ఎంతో అందంగా కనపడాలని ఇష్టపడుతుంటారు, కానీ మీరు అందుకు భిన్నంగా మీ సహజమైన మేకప్ లేని ముఖాన్ని దైర్యంగా ప్రేక్షకులకు చూపడం గొప్ప విషయం అంటూ ఆమెపై ప్రశంశలు కురిపించారు. అయితే ఈ విషయమై ఇటీవల కాజల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఆ విధంగా ఫోటో రిలీజ్ చేసిన తనపై పలువురు తన సన్నిహితులు కూడా మంచి ప్రశంసలు కురిపించారని అన్నారు. నిజానికి తనకు లైఫ్ నిచ్చిన ప్రేక్షకుల వద్ద తన నిజమైన అందాన్ని దాచే ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఆ విధంగా ఫోటోలు రిలీజ్ చేసానని కాజల్ చెప్పుకొచ్చారు.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: