టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు అల్లు అర్జున్, తాతయ్య అల్లు రామ లింగయ్య, తండ్రి అల్లు అరవింద్ ల ఆశీస్సులతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఇక నటుడిగా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన ఆర్య సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించడంతో పాటు నటుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన అర్జున్, ఎందరో అభిమానులను మంచి క్రేజ్, ని మంచి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా ఆయన హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. 

 

బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ థమన్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. అయితే సినిమా మంచి హిట్ కొట్టడంతో అల మూవీ యూనిట్ నిన్న ఒక సక్సెస్ మీట్ ని నిర్వహించింది. అయితే అందులో భాగంగా కొందరు మీడియా మిత్రులకు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరే నిజమైన సంక్రాంతి విన్నర్ కదా దీనిపై మీరు ఏమి చెప్తారు, బాహుబలి 1 రికార్డ్స్ ని సునాయాసంగా మీ సినిమా దాటేసింది కదా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి వంటి ప్రశ్నలు అడగాలి అంటూ అల్లు అర్జున్ పిఆర్ టీమ్ ఫోర్స్ చేస్తూ కోరడం జరిగిందని పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

 

అయితే ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందనే విషయం అటుంచితే, దీనిపై ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వారిద్దరూ తమ సినిమాల రికార్డుల విషయమై ఎప్పుడూ ఇలా ఫోర్స్డ్ గా ప్రచారాలు చేసుకోలేదని, మరి అటువంటిది నీకు ఎందుకు ఈ రికార్డుల పిచ్చి బ్రదర్, నిజంగా మీ సినిమా మంచి రికార్డ్స్ కొట్టింది అనే విషయం అందరికీ తెలిసినపుడు, దానిని గురించి మీకు మీరే మరింత గొప్పలుగా చెప్పుకుంటూ డప్పులు కొట్టుకోవడం ఏంటని కొందరు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: