టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి ఛలో అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా, తొలి సినిమాతోనే మంచి హిట్ ని అందుకుంది. నాగశౌర్య హీరోగా మంచి యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఆ సినిమాలో రష్మిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత రౌడీ హీరో విజయ దేవరకొండ సరసన ఆమె నటించిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్ కొట్టగా, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో రష్మిక క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఇక ప్రస్తుతం బన్నీ సరసన ఒక సినిమాతో పాటు నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటిస్తున్న రష్మిక విషయమై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. 

 

అదేమిటంటే, మొదటి నుండి తన వ్యక్తిగత, అలానే సినిమాలకు సంబంధించి చాలావరకు విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసే అలవాటున్న రష్మిక, తాను పెట్టె పోస్టులపై కొంత ఫన్నీ గా కోతి ఎమోజిలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇతరుల గురించి తాను ప్రస్తావించిన సమయంలో కూడా తన గురించి తానే ఒక పిల్ల కోతిగా భావిస్తూ ఒకింత ఫన్నీ గా కోతి ఎమోజిలు పోస్ట్ చేసే ఆమెపై కొందరు టాలీవుడ్ ప్రముఖులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సరిలేరు సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ, మీరు మీ గురించి ఎప్పుడు ఏది పోస్ట్ చేసినా కోతి ఎమోజిలు పెట్టి పోస్ట్ చేస్తుంటారు కదా, 

 

ఎందుకలా అని రష్మికను ప్రశ్నించగా, నేను ఎక్కువగా గోల, అల్లరి చూస్తుంటానని నా ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ అందరూ తనను కోతిలా ఉన్నావు అంటూ ఉంటారని, అందుకే సరదాగా ఆ ఎమోజి పోస్ట్ చేస్తానని ఆమె సమాధానం చెప్పడం జరిగింది. అయితే దీనిపై కొందరు నెటిజన్లు కూడా సరదాగా, మేడం మీరు పోస్ట్ చేసే కోతి ఎమోజిలు ఎంతో ఫన్నీ ఉంటాయి, వాటిని చూసి మేము నవ్వుకుంటుంటాము అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఆ విధంగా సరదాగా పోస్టులు పెడుతున్న మీరు ఒక పేరున్న స్టార్ హీరోయిన్ అనే విషయం మరిచిపోయారా, అసలు మీకు ఆ విషయం గుర్తుందా, మేము చెప్పేది మీకు అర్ధమవుతుందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: