మెగా బ్రదర్స్ ...మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ బ్రదర్స్ ని చూస్తే ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చాలామందికి అసూయ కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధం అలాంటిది. అన్న కోసం తమ్ముళ్ళు ..తమ్ముళ్ళ కోసం అన్న అన్నట్టుగా కాకుండా చిరంజీవి తమ్ముళ్ళిద్దరిని కొడుకుల్లా చూసుకోవడం గొప్ప విషయం అయితే ఈ తమ్ముళ్ళిద్దరు అన్నయ్యని తండ్రిలా చూడటం అంతకంటే గొప్ప విషయం. తమ్ముళ్ళకి చిన్న ఆపద వస్తేనే అన్నయ్యకి కంట్లో నీళ్ళు తిరుగుతాయి అన్నంతగా ముగ్గురు మధ్య బంధం నిలబడిపోయింది. సినిమాలలో గాని వ్యక్తిగతంగా గాని ముగ్గురు మొనగాళ్ళే. అసలు అప్పట్లో తీసిన ముగ్గురు మొనగాళ్ళు సినిమా ఇప్పుడు గనక తీస్తే ఈ మెగా బ్రదర్స్ తోనే తీసేవారేమో మన టాలీవుడ్ మేకర్స్.

 

అన్నయ్యతోనే కాదు వదినమ్మ తోను మెగా సోదరులైన నాగబాబు, పవన్ కళ్యాణ్ అంతే ఆప్యాయంగా ఉంటారు. వదినని తల్లి లా చూసుకుంటారు. ఇది కేవలం మెగా సోదరులకే సాధ్యమైందని చెప్పాలి. ఇక నాగ బాబు నిర్మాత అవడానికి, పవన్ కళ్యాణ్ హీరో అవడానికి అసలు ముఖ్యమైన వ్యక్తి మెగాస్టార్ సతీమణి సురేఖ బాధ్యతే ఎక్కువ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్న కోసం తమ్ముళ్ళు, తమ్ముళ్ళ కోసం అన్న విధంగా వీరి మధ్య బంధం కొనసాగడం బహుషా ఒక్క మెగా ఫ్యామిలీకే సాధ్యమైంది.

 

ఇక నిర్మాతగా నాగబాబు అన్నయ్య కొడుకు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఆరెంజ్ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అప్పటికే అన్నయ్య తో తమ్ముడితో సినిమాలు తీసి హిట్ కొట్టిన నాగబాబు అన్న కొడుకుతో సినిమా అనగానే ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయింది. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న భాస్కర్ డైరెక్షన్ లో ఆరెంజ్ సినిమాను నిర్మించారు నాగబాబు. అయితే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. నాగబాబు బాగా నమ్మి ప్రొడక్షన్ వ్యవహారాలు అప్పగిస్తే కాస్ట్ ఆఫ్ బడ్జెట్ విపరీతంగా పెంచేసి సినిమాకి అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేశారు. 

 

దాని వల్ల సినిమాకి పూడ్చలేని లాస్ వచ్చింది. దాంతో నాగబాబు ఆర్ధికంగా అప్పుల్లో కూరుకుపోయారు. ఆ అప్పుల బాధ తో ఉన్నదంతా అమ్మేసి అప్పులు కట్టేసినా ఇంకా చాలా అప్పులు మిగిలి ఉన్నాయని ఆవేదనతో కృంగిపోయి చాలా నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే ఎవరి దగ్గర ఆశించకూడదనుకున్న నాగబాబు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. సరిగ్గా అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి ఫోన్ చేసి అన్ని  మర్చిపో నీకు నేనున్నాను అని ఒకే ఒక్క మాట చెప్పాడట. ఆ క్షణం గనక పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఫోన్ చేసి మాట్లాడకపోయి ఉంటే ....ఆ తర్వాత జరిగేది తలుచుకోవడానికి..ఊహించడానికే భయంగా ఉంటుంది. అలా అన్న వెన్నంటే ఉండి పవన్ కళ్యాణ్ నాగబాబు ని కాపాడుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: