పరిశ్రమకు ఎంతోమంది ఎంట్రీ ఇచ్చినా కొందరికి మాత్రమే ప్రేక్షక హృదయాల్లో చోటుంటుంది. టాలెంట్ ఉన్నా సరే అది ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటేనే ఏ హీరోయిన్ కైనా సరే కెరియర్ స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. అలా పదేళ్ల క్రితం ఏ మాయ చేసావే సినిమాతో వచ్చి తెలుగులో స్థిరపడ్డ నటి సమంత. తను చేసే ఎలాంటి పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసే నటీమణి సమంత అందుకే ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్లిపోతున్న హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా ఫుల్ ఫాం లో ఉంది సమంత.

 

మాములుగా పెళ్లి తర్వాత అసలు హీరోయిన్స్ కు డిమాండ్ ఉండదు. కాని అక్కినేని కోడలు సమంతకు మాత్రం పెళ్లి తర్వాత మరింత లక్ కలిసి వచ్చినట్టు ఉంది. కేవలం సినిమాలే కాదు ఫోటో షూట్స్ లో కూడా తన సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా రవి వర్మ గీసిన బొమ్మలా ఫోజు ఇచ్చిన సమంత చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నిమ్మకాయ పట్టుకుని ఉన్న మహిళ బొమ్మ రవివర్మ గ్రేట్ పిక్స్ లో ఒకటి. NAAM ఫోటో షూట్ లో వెంకట్ రాం అనే ఫోటో గ్రాఫర్ సమంతతో సేమ్ రవి వర్మ గీసిన బొమ్మగా ఫోటో తీశాడు.   

 

రవి వర్మ వేసిన బొమ్మకు ప్రాణం వస్తే అది సమంతే అనేలా ఉంది ఈ పిక్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పిక్ చూసిన అక్కినేని, సమంత ఫ్యాన్స్ మాత్రం రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో అంటూ వేటూరి రాసిన పాట పాడుకోవడం ఖాయం. సినిమాల్లో నటించడమే కాదు ఇలా వెరైటీ పిక్స్ తో సమంత తన స్పెషాలిటీ ఏంటో చూపిస్తుంది. సమంత రవివర్మ గీసిన బొమ్మగా ఫోజులివ్వడం చూసి ఆమె ఫ్యాన్స్ భలే సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: