నాగశౌర్య కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన ‘ఛలో’ మూవీ తరువాత వెంకీ కుడుముల నాగశౌర్య లు కలిసి మళ్ళీ మరొక మూవీ చేయలేదు. దీని వెనుక గల అసలు కారణం వివరిస్తూ నాగశౌర్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ కుడుములను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

‘జాదుగాడు’ మూవీ నుండి తనకు వెంకీ కుడుముల తెలుసు అనీ ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అతడి పనితనం నచ్చి తాను వెంకీకి దర్శకుడుగా ఇచ్చిన అవకాశాన్ని తెలియ చేస్తూ ‘ఛలో’ మూవీ సక్సస్ తరువాత తాను వెంకీ కుడుముల కు స్వాన్కి కారును బహుమతిగా ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు. అయితే ఆ తరువాత వెంకీ తాను ఇచ్చిన కారును వాడటం లేదు సరికదా తాను ఫోన్ చేస్తే ఫోన్ కూడ లిఫ్ట్ చేయడం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 

ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్ లో తన సినిమాలు ఈ దర్శకుడుతో ఉండవని క్లారిటీ ఇచ్చాడు. ఒకవైపు ఈ దర్శకుడు నితిన్ తో తీసిన ‘భీష్మ’ మూవీ ఈ ఈనెల విడుదల కాబోతున్న పరిస్థితులలో వెంకీ ని టార్గెట్ చేస్తూ నాగశౌర్య ఇలాంటి కామెంట్స్ చేసాడు అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.

గత వారం విడుదలైన ‘ఆశ్వద్దామ’ నాగశౌర్య కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ఇచ్చిన మూవీగా రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా ఈమూవీ కలక్షన్స్ నిన్న కూడ సంతృప్తిగా ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చినా సగటు ప్రేక్షకుడి ఆదరణ రావడంతో ఈ యంగ్ హీరో నిన్నటి మొదటి సోమవారం పరీక్షలో పాస్ అయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ జోష్ తో నాగశౌర్య తన సొంత బ్యానర్ పై మరిన్ని సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: