టాలీవుడ్ లో తమకంటూ పేరు ఒక్క ప్రత్యేక స్థానం తెచ్చుకున్నారు ఇద్దరు హీరోలు. ఒక్కరు హీరోగా అభిమానులను సంపాదించుకుంటే మరొక్కరు విలక్షణ నటుడిగా మెప్పించి ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్నారు. వారిద్దరు ఒక్కే తెరపై కనిపించారంటే ఇక ప్రేక్షకులకు సందడి మొదలైంటే. వారే మన మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. టాలీవుడ్ కు ఇద్దరూ విలన్ గా పరిచయమైయ్యారు. ఆపై ఇద్దరు హీరోలుగా మెప్పించిన నటులే. ఇద్దరూ కలిసి బిల్లా - రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. 

 

ఆపై ఎన్నో చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు, విలన్ గా తనదైన విలక్షణ శైలిలో మెప్పించారు కూడా.  వీరిద్దరి మధ్యా ఉన్న స్నేహం గురించి మాట్లాడుకుంటే, ముందు గుర్తొచ్చేది టామ్, జెర్రీలే. పక్క పక్కనే ఉంటూ నిత్యం పోట్లాడుకుంటున్నట్టే ఇద్దరూ ఉంటారు. ఒకే వేదికపై ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు కూడా సంధించుకుంటుంటారు. అయినా తామిద్దరమూ ఒకటేనని అంటారు. విభేదాలు పైకి మాత్రమే ఉంటాయని తెలిపారు. తన కుటుంబాలు రెండూ ఒకటేనని ఇద్దరూ చెబుతుంటారు.

 

ఇక చాలా సంవత్సరాల తరువాత వీరిద్దరూ కలిసి నటించనున్నారన్నది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనున్నారట.

 

ఈ వార్తపై అధికారిక సమాచారమైతే ఇంతవరకూ వెలువడలేదు. గానీ, అదే నిజమైతే, ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందన్న మాట మాత్రం వాస్తవం. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను, ఓ పాటను కూడా కొరటాల తెరకెక్కించాడు. ఈ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని చిత్ర యూనిట్ ధ్రువీకరించాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: