హాస్యనటుడు పృథ్వి రాజ్ ఎస్వీబిసి చైర్మన్ పదవి నుండి రాజీనామా చేయడానికి ఒక ఆడియో టేప్ కారణమని అందరికీ తెలుసు. అయితే ఆ ఆడియో టేప్ లో పృథ్వి రాజ్ ఒక మహిళా ఉద్యోగినితో శృంగారభరిత సంభాషణను కొనసాగిస్తాడు. దీంతో ఆ ఆడియో టేప్ ఫుల్లుగా వైరల్ అయింది. అలాగే నెట్టింట పృథ్వి రాజ్ పై అనేకమైన ఫన్నీ మీమ్స్ దర్శనమై హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇదంతా జరిగి ఒక నెల రోజులు గడిచిపోవడంతో ప్రస్తుతం దీని గురించి అందరూ మర్చిపోయారు. కానీ ఈటీవీ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్లు మాత్రం పృథ్వీ రాజ్ ఆడియో టేప్ గురించి ఇప్పటికీ మర్చిపోలేదని తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ని చూస్తే అర్థమవుతుంది.


సాధారణంగా పంచులు మహా రాజు హైపర్ ఆది ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ధైర్యంగా పంచులు వేస్తూ వార్తల్లోకెక్కుతాడు. కానీ ఈ సారి మాత్రం కొత్తగా టీం లీడర్ అయిన మహిధర్ వైసిపి నేత పృథ్వీరాజ్ ఆడియో టేప్ లోని డైలాగులను చెప్పి సంచలనం సృష్టిస్తున్నాడు. అతడు తన స్కిట్ లో భాగంగా ఒక లేడీ గెటప్ లో ఉన్న హాస్యనటుడిని ఉద్దేశిస్తూ... 'నిన్న నువ్వు నీ ఫ్రెండ్ కావ్య తో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లావు కదా? అని ప్రశ్నించగా.. ' నీకెలా తెలుసు?', అని ఆ లేడీ అంటుంది. అప్పుడు మహీధర్.. 'నేను అక్కడికి వచ్చాను, నిన్ను చూసాను', అని అంటాడు. దాంతో 'మరి పిలవచ్చు కదా' అని లేడీ అనేసరికి... 'పిడవడం కాదు వెనక నుంచి గట్టిగ పట్టుకుందాం అనుకున్నాను. కాని నువ్వు అరుస్తావేమో అని భయమేసి ఆగిపోయా” అంటూ డైలాగ్ వదులుతాడు. ఔనా అని లేడీ గెటప్ వేసిన కమెడియన్ అనేసరికి... ' అవును, రా! ఏదైనా నువ్ నా గుండెల్లో ఉన్నావురా', అంటూ మరొక పృథ్వీరాజు డైలాగ్ ని మహిధర్ చెప్పేస్తాడు. దీంతో రోజా గుండెలు బాదుకుంటూ మరీ నవ్వుతుంది.

అయితే ప్రస్తుతం మహిధర్ చెప్పిన ఈ రెండు డైలాగుల వీడియో క్లిప్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు మహిధర్ పృథ్వి రాజ్ ఆడియో టేప్ లోని డైలాగులను చెప్పి అతడిని ఘోరంగా అవమానించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: