అక్కినేని అఖిల్ మొద‌టి నుంచి కూడా ఎన్ని చిత్రాల్లో న‌టించినా ఆశించినంత విజ‌యం మాత్రం రాలేదు. అందుకే ప్ర‌స్తుతం ఆయ‌న గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ పై బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక అఖిల్‌కి ఈ సినిమా స‌క్సెస్ అనేది చాలా కీల‌కం. ఇక ఈ సినిమాతో పూర్వ వైభవం పొందేందుకు బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.

 

అయితే ఈ చిత్రంలో పూజాతో పాటు మ‌రో హీరోయిన్ కూడా అఖిల్‌తో న‌టిస్తోంద‌ని వాస్త‌లు వ‌స్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు మ‌న తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా ఈ  చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే అఖిల్ ఇషాల మీద కూడా కొన్ని సన్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఈషా కూడా ఒక మంచి బ్రేక్ వ‌చ్చే చిత్రం కోసం వెయిట్ చేస్తుంది. ఇక చిన్న చిన్న చిత్రాల్లో మెయిన్ హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ పెద్ద హీరోల స‌ర‌స‌న మాత్రం సెకండ్ హీరోయిన్‌గానే బుక్ అవుతుంది. అందుకు ఈషా కూడా మొహ‌మాట ప‌డ‌కుండా ఓకే అంటోంది.

 

ఇక గ‌తంలో కూడా వీరిద్ద‌రి కాంబినేష‌న్ తెర‌కెక్కింది ఎన్టీర్ స‌ర‌స‌న పూజా, ఈషా ఇద్ద‌రూ న‌టించారు. ఇప్పుడు మ‌ళ్ళీ మ‌రోసారి స్క్రీన్ మీద  వీరిద్ద‌రూ అఖిల్ నాలుగ‌వ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. ఇక అర‌వింద స‌మేత చిత్రం మాత్రం పెద్దగా హిట్ కాలేదు కాని మ‌రి ఈ సినిమా ఏమాత్రం స‌క్సెస్‌ను సాధిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా పైన ఆశ‌లు పెట్టుకున్న అఖిల్‌కి ఎలాంటి స‌క్సెస్ ద‌క్కుతుందో ఏమో మ‌రి. అలాగే ఈషారెబ్బా కి కూడా ఈ చిత్రంతోనైనా స‌రే స్టార్ డ‌మ్ తిర‌గాలి మ‌రి ఏం జ‌రుగుతుందో ఏమో మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: