టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు, ఇటీవల సూపర్ స్టార్ మహేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక నటించిన ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ప్రస్తుతం శర్వానంద్, సమంతల కలయికలో రాజు రూపొందిస్తున్న జాను సినిమా మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇప్పటికే సాంగ్స్ కూడా మంచి స్పందన రాబట్టడంతో సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేటి సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరుగనుంది. ఇకపోతే ఇవాళ ఉదయం ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ, 96 రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడిగా అదే సినిమాని తీసిన ప్రేమ్ కుమార్ అయితేనే కరెక్ట్ అని భావించి తెలుగు వర్షన్ కి కూడా అతన్నే దర్శకుడిగా తీసుకున్నాం అని అన్నారు. అయితే సినిమా తెలుగు వర్షన్ కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసి నేను ప్రేమ్ ముందు ఉంచాను, 

 

అయితే అతడు మాత్రం అవేవి పట్టించుకోకుండా తాను తీయదలుచుకుంది మాత్రమే తీసాడు. ఇక అతడు భావించిన మేరకు మన తెలుగు వర్షన్ లో తీసిన సినిమా ఇటీవల చూస్తే తనకు ఎంతో నచ్చిందని, మేము చెప్పినవి పట్టించుకోలేదని అనుకున్నాం కానీ, దాదాపుగా మేము ఊహించిన విధంగానే ఎంతో అద్భుతంగా ప్రేమ్ ఈ సినిమాని తీసాడని చెప్పుకొచ్చారు. సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ మంచి హుషారుగా ఉంటుందని, ఇక కీలక ఎమోషనల్ సీన్స్ లో సమంత, శర్వా ఇద్దరూ కూడా పోటీపడి నటించారని, తప్పకుండా సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....'!!

మరింత సమాచారం తెలుసుకోండి: