టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ లభించడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. అయితే మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం అనే చెప్పాలి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ, టబు, అక్కినేని సుశాంత్, నివేత పేతురజ్, ఈశ్వరి రావు, జయరాం, సునీల్ నవదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటించగా సినిమాని త్రివిక్రమ్ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 

 

ఇక ఈ సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని ఇటీవల పలు సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేసిన సినిమా యూనిట్, నిన్న సాయంత్రం టాలీవుడ్ దర్శకులు అలానే ముఖ్యమైన ప్రొడ్యూసర్లను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వడం జరిగిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ పార్టీలో సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి కనపడకపోవడం. అలానే బన్నీతో ప్రస్తుతం సినిమా తీస్తున్న సుకుమార్ కూడా ఈ పార్టీలో కనపడలేదు. అయితే సుకుమార్ మాత్రం ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉండడం వలన రాలేకపోయారని అంటున్నారు. అయితే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా మంచి సక్సెస్, కలెక్షన్ సాధించిన విషయం తెలిసిందే. 

 

ఇక ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య ఇప్పటివరకు కలెక్షన్స్ వార్ జరిగిన విషయం అందరికీ తెలుసు. అందువల్లనే ఈ పార్టీకి అనిల్ ని పిలవలేదని అంటున్నారు. అయితే నిజానికి అనిల్ కూడా పార్టీకి పిలిచారని, ఆయన కొన్ని అనివార్య కారణాల వలన రాలేకపోయారని మరొక వాదన కూడా వినపడుతోంది. మరి వీటిలో ఏది నిజమో తెలియదు గాని, సరిలేరు దర్శకుడు అనిల్ ఈ పార్టీలో కనపడకపోవడం మాత్రం చాలా అనుమానాలకు తావిస్తోంది మరి. దీనిపై బన్నీ అండ్ టీమ్ వివరణ ఇవ్వాల్సిందే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: