సూపర్​స్టార్​ మహేశ్​బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే  ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి ఫారెన్ వెకేషన్‌కు వెళ్లిన మహేశ్..విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక సూపర్‌స్టార్ తదుపరి సినిమా కూడా ఓకే అయ్యింది. ఆయన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘మహార్షి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో సర్కులేట్ అవుతోంది. 

 

మహేష్ తాజా చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నది. ఈ చిత్రం యొక్క ఫ్రీ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నిన్నటివరకు ఈ చిత్రంలో మహేష్ ను స్పై కథాంశంతో జేమ్స్ బాండ్ లా చూపించేందుకు దర్శకుడు వంశీ రెడీ అవుతున్నాడనే సమాచారం చక్కెర్లు కొట్టింది. అయితే కొత్తగా ఓ సరిక్రొత్త న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే ....

 

టాలీవుడ్ సినీవర్గాల తాజా సమాచారం ఏమంటే.. ఈ సినిమాలో మహేష్ పోషిస్తున్నది, గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహాలో సాగబోతుందని చెప్తున్నారు. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది. మ‌హేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో నేటి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఈ సినిమాలో పర్యావరణం గురించి మహేష్ పోరాడబోతున్నట్లు చెప్తున్నారు.

 

ఇక ఇందులో హీరోయిన్ గా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫైనల్ అయినట్టు సమాచారం. గతంలో ఈ క్రేజీ జోడీ ‘భరత్ అనే నేను’లో ఆడిపాడింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ..త్వరలోనే మూవీ టీమ్ అఫిషయల్ అనౌన్స్‌మెంట్ చేయనుంది. స్పై థ్రిల్లర్​ కథాశాంతో రూపొందే ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మంచనున్నారు.. అని తెలుస్తోంది. భారీ చిత్రాల భారీ కాంబినేషన్ కనుక సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే అంటున్నారు టాలీవుడ్ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: