వెర్రి వేయి విధాలు అంటారు. ఈ వెర్రిని ప్రదర్శించడానికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు కొందరు.. అలా తమ చిత్ర, విచిత్రమైన విన్యాసాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ఆరాట పడుతుంటారు.. ఇక ఇప్పుడు ప్రపంచం అంతా గజగజ వణికేలా చేసిన కరోనా వైరస్ గురించి అందరికి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం వల్ల చైనా నుంచి రాకపోకలు కూడా తగ్గిపోయాయి. ఆ దేశంలో ప్రాణాలు పిట్టలా రాలిపోతున్నాయి..
దీనికంతటికి బాధ్యులు ఎవరనే విషయాన్ని పక్కన పెడితే, దీనివల్ల ప్రపంచానికి నష్టం కలుగకుండా సమిష్టి కృషి చేయడం ఇప్పుడు మేధావులముందు ఉన్న సవాల్. తప్పు చేసినోడు శిక్ష అనుభవించే కాలం పోయి. చేసిన తప్పుకు తోటివారుకూడా శిక్ష అనుభవించేలా చేస్తున్న కొందరి చర్యలకు కాలమే సమాధానం చెబుతుంది. ఇకపోతే చైనాకు వెళ్లాలంటే భయపడే రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఒక వేళ ఫ్రీగా చైనాకు రండని అక్కడి ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా బ్రతికుంటే బఠానీలు అమ్ముకునైనా ఉంటాం గాని, లక్షల జీతాలిచ్చిన చైనా వెళ్లం అని ఖచ్చితంగా చెబుతారు.
ఇంతలా అందరు చైనాకు వెళ్లడానికి భయపడుతుంటే ఓ బాలీవుడ్ నటి మాత్రం చైనాకి వెళ్లి కరోనా వైరస్ ను అంతం చేస్తానంటోంది. వైరస్ అంతం చేసాకనే తిరిగి ఇండియా వస్తానని శపథం చేస్తోంది... ఇంతలా ప్రాణాలను లెక్క చేయకుండా అంతటి సాహసానికి తెగించిన నటి ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆ నటి పేరు రాఖీ సావంత్.. ఎప్పుడు వివాదాల్లో తలదూర్చే రాఖీ సావంత్ తాజాగా విమానంలో కూర్చుని, ఓ వీడియో తీశారు.
అందులో ‘నేను కరోనాకు ఏ మాత్రం భయపడటం లేదు. దానిపై పోరాడేందుకు చైనాకు వెళుతున్నా.. కరోనా వైరస్ను అంతమొందించిన తరువాతే నేను ఊపిరి పీల్చుకుంటా. అందుకే ఇప్పుడు నేను చైనాకు వెళుతున్నా. దీనికి ఔషదాన్ని అందించాలని నాసాను కూడా అడుగుతా అంటూ రాఖీ స్పష్టం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్తోంది. ఎందుకు ఈ వీడియో తీసింది అనే విషయంలో సృష్టత లేదు.. కానీ ఆమె చేసిన వీడియో మాత్రం ఇప్పుడు కొందరికి నవ్వు తెప్పిస్తుండగా, వెళ్లితే వెళ్లావుగాని ఆ వైరెస్కు అడ్దగా నువ్వు మారి ఇండియాకు మాత్రం తిరిగిరాకు తల్లి అని కామెంట్స్ చేస్తున్నారట కొందరు నెటిజన్స్..