రవి వర్మ కుంచెలో సమంత ఒదిగిపోయింది. సమంత బొమ్మ గీయడానికి రవివర్మ లేకపోయినా.. ఆయన గీసిన బొమ్మ మళ్లీ ప్రాణం పోసుకుంది. రవివర్మే దిగివచ్చి సమంతను పేపర్ పై బంధించాడా.. అనే అనుమానం కలుగకమానదు.

 

సమంత రవివర్మ బొమ్మలా మారిపోయింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్, విజువల్ ఆర్టిస్ట్ వెంకట్ రామ్ సమంతను రవివర్మ గీసిన బొమ్మలా మార్చాడు. ఒరిజినల్ ఆర్ట్ ను మించి అందంగా కనిపిస్తోంది సామ్. ఇంత బాగా మలిచిన వెంకట్ కు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది సమంత. 

 

హీరోయిన్స్ ను రవివర్మ బొమ్మలా తీర్చిదిద్దడం వెంకట్ కు అలవాటే. గతంలో తీసిన ఫోటో షూట్స్ ఆయనలోని టాలెంట్ ను బయటపెట్టాయి. శృతిహాసన్..ఐశ్వర్యరాజేష్, రమ్యకృష్ణ, ఖుష్బూతో రవివర్మ ఆర్ట్ కు ప్రాణం పోశాడు వెంకట్ రామ్. 

 

సమంత రవివర్మ పెయింటింగ్ లో ఇమిడిపోవడమే కాకుండా.. మరిపించింది. సామ్స్ నటించిన కొత్త చిత్రం జాను ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. సమంత తర్వాతి మూవీపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ప్రస్తుతం జాను ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుందా లేదంటే.. స్టార్ హీరో ఆఫర్ అందుకుంటుందో చూడాలి. 

 

మొత్తానికి సమంతకు అరుదైన ఘనత తెచ్చింది ఆ పెయింటింగ్. రవివర్మ లేకున్నా.. ఆయన చిత్రంలో దాగుండటం అంటే మామూలు విషయం కాదు. రవివర్మకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పెయింటింగ్స్ అంటే పడి చచ్చేవారు ఉన్నారు. ఎక్కడ కనిపించినా కొనుగోలు చేయాలని ఆరాటపడతారు. అలాంటి చిత్రాల్లో సమంత ఒదిగిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఇపుడు రవివర్మ పెయింటింగ్స్ లో హీరోయిన్స్ కనిపించడంతో.. సదరు భామల ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. మార్కెట్లోకి ఎపుడు వస్తాయా.. కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుందామా అని ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: