దేశాన్ని కదిలించి వేస్తున్న కరోనా వ్యాప్తి మరింత పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే కరోనా బారిన పడి 450 మంది మృతి చెందారు. మరో 16 వేల మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు.ఇప్పటికే కేరళలో రెండు కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా మరోకేసు నమోదు కావడంతో దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వ్యాధిగ్రస్థులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. తాజాగా కేరళలో మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారించారు. అయితే, చైనా నుంచి వచ్చిన కొంతమందిని హర్యానా లోని మానెసర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ లో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా, మరో ఐదుగురికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

 

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ వైరస్ ను త్వరగా నివారించే  మార్గాలను పెంచాలని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ వైరస్ సోకితే ఎలాంటి మందులు లేవు. ఇప్పటివరకు ఎలాంటి చికిత్స అందుబాటులోకి రాలేదు. దీంతో రాష్ట్రాల అధికార యంత్రాంగాలు ప్రత్యేక వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అది అలా ఉంటే ఈ కరోనా వైరస్ సోకిన లక్షణాలతో ఓ హీరోయిన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బోజ్ పురి హీరోయిన్ రాణీ ఛటర్జీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.

 

ఆమె తన సోషల్ మీడియాలో రాస్తూ.. 'గత10 రోజులుగా జ్వరం, జలుబు, తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నా'నని రాణీ ఛటర్జీ తెలుపుతూ.. కరోనా వైరస్ లక్షణాలు ఎదుర్కొంటున్నానేమోనని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆమె అభిమానులు పలు ఆగోగ్య సూచనలు చేస్తూ.. జాగ్రత్త అంటూ ఆమె బాగుండాలని ప్రార్ధనలు చేస్తున్నారు. మరి ఆమెకు నిజంగానే కరోనా సోకిందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: