ఈ మద్య సీనియర్ హీరోయిన్లు కాస్త ట్రెండ్ మారుస్తున్నారు. అప్ కమింగ్ బ్యూటీలు గ్లామర్ కి పరిమితమైతే అనుష్క,త్రిష, నయనతార, కాజల్ లాంటి హీరోయిన్ ఇప్పుడు నటనపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. గతంలో ఈ ముద్దుగుమ్మలు తమ అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కెరీర్ పదేళ్లు దాటుతున్న హీరోయిన్లు తమ ఏజ్ కి తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. ఎక్కువగా గ్లామర్ సైడ్ వెళ్లకుండా.. తమకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనుష్క లేడీ ఓరియెంట్ మూవీస్ లో దుమ్మురేపుతుంది. రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి తర్వాత నిశ్శబ్దం మూవీలో నటిస్తుంది.
ఈ నేపథ్యంలో త్రిష సైతం హర్రర్ మూవీస్, లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది. ఇక దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి నయనతార సైతం ఈ మద్య సెలెక్టెడ్ పాత్రల్లో మాత్రమే నటిస్తుంది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ లాంటి హీరోలతో నటిస్తుంది. గత ఏడాది చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీలో నటించినంది నయన్. ఈ ఏడాది మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్భార్’ మూవీలో నటించిొంది. ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస సినిమా ఆఫర్స్ ఆమెని పలకరిస్తున్నాయి. చివరిగా దర్భార్ మూవీలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు రజనీకాంత్ 168వ మూవీలోను నటిస్తుంది. తాజాగా రజనీకాంత్ పాత్రకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో షికారు చేస్తుంది.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న రజనీకాంత్ 168వ మూవీ శివ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ విశేషం ఏంటేంటే.. నయనతార కెరీర్ లో మొదటి సారిగా ఓ న్యాయవాది పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటి వరకు వివిధ పాత్రలో నటించిన నయన్ ఎప్పుడూ లాయర్ పాత్రలో కనిపించలేదు. తాజాగా రజనీకాంత్ పాత్రకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో షికారు చేస్తుంది. నయనతార తొలిసారి లాయర్ పాత్రలో కనిపించనుందని, ఆమె పాత్ర ప్రేక్షకులకి మంచి వినోదం పంచేలా ఉంటుందని కోలీవుడ్ టాక్. ఇక మూవీలో రజనీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, పాత తరం హీరోయిన్ పాత్రకి సంబంధించి క్లారిటీ రావలసి ఉంది .