తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో ఎంత పెద్ద హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షో కి వచ్చే టిఆర్పి రేటింగ్స్ మరొక షో కి ఆ స్థాయిలో రావటం అన్ని సంవత్సరాలు రావటం అసంభవమని చాలామంది అంటుంటారు. ఇటువంటిది ఈ షో నుండి జడ్జీగా ఉన్న నాగబాబు బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చేసిన నాగబాబు జీ తెలుగులో అదిరింది అనే షో కి జడ్జి గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో నుండి జబర్దస్త్ పై మరియు న్యాయనిర్ణేతల పై నాగబాబు తనదైన శైలిలో ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదే తరుణంలో జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న వైసిపి పార్టీ ఎమ్మెల్యే రోజా పై కూడా కామెంట్ చేసినట్లు దీంతో వీళ్లిద్దరూ గొడవ రెండు పార్టీల గొడవ అన్నట్లు ఇటీవల మారింది.

 

ఇటువంటి తరుణంలో జబర్దస్త్ షోలో స్టార్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను గత కొంత కాలం నుండి అలరిస్తున్న ఆటో రాంప్రసాద్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్... నాగబాబుని ఉద్దేశించినవేనా అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే  ‘త్రీ మంకీస్’ అనే సినిమాలో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా అనిల్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. కాగా ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు నాట్ అయిన నేపథ్యంలో రాం‌ప్రసాద్ జబర్దస్త్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

 

‘జబర్దస్త్‌ను వదిలేసే ఆలోచన ఏమైనా ఉందా.. కొత్తగా చాలా షోస్ వస్తున్నాయి కదా అందులో ఆఫర్స్ రావట్లేదా.? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. ‘జబర్దస్త్‌లో చేస్తే వచ్చే పేరు.. మరే షో చేసినా రాదు. అందుకే నేను మిగతా ఏ షోకి వెళ్ళలేదు. అంతేకాకుండా జబర్దస్త్ ఓ మ్యాజిక్ అని.. కొత్త షోతో అలాంటిదే మళ్ళీ జరగాలంటే సాధ్యం కాదని.. జబర్దస్త్‌ను వదిలిపెట్టనని రాం ప్రసాద్ తేల్చి చెప్పారు. తనతో పాటుగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ను వదిలిపెట్టరని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ కామెంట్స్‌తో పరోక్షంగా మెగా బ్రదర్‌కు చురకలు అంటిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: