టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదట యావరేజ్ టాక్ ని అందుకున్నప్పటికీ, చాలా రోజుల గ్యాప్ తరువాత మహేష్ బాబు మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన పాత్రలో నటించడంతో పాటు సంక్రాంతి సందర్భంగా వరుసగా సెలవలు రావడం ఈ సినిమాకు అద్భుతంగా కలెక్షన్స్ రావడానికి కారణం అయింది. ఫైనల్ గా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా పై సూపర్ స్టార్ మహేష్ సహా యూనిట్ సభ్యులు మొత్తం ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, మరొక రెండు నెలల తరువాత ఇండియాకి తిరిగి రానున్నారు. 

 

వచ్చిన తరువాత ఏప్రిల్ నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు సూపర్ స్టార్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ని ఎవరు అందిస్తున్నారు అనే దానిపై కొద్దిరోజలుగా మహేష్ ఫ్యాన్స్ లో తీవ్రంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే కొందరు ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నట్లు చెప్తుంటే, మరికొందరు మాత్రం కాదు కాదు దేవినే మళ్ళి పని చేస్తున్నాడని అంటున్నారు. 

 

అయితే దీనిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. మరి ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ దగ్గరి నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు ఎవరెవరు పని చేస్తున్నారు అనే విషయాలన్నిటిలో క్లారిటీ రావాలంటే దర్శకుడు వంశీ, లేదా నిర్మాతలు, లేక మహేష్ బాబు స్పందించాల్సిందే మరి. ఇక అప్పటివరకు మాత్రం ఈ ఊహాగానాలు ఆగవు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: