సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'జాను'. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలయిన టీజర్లు, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టున్నాయి. ఈ సందర్బంగా చిత్ర బృందం మరో సాంగ్ ను విడుదల చేశారు.

 

 ఎడారి ఎదురైనా ఎటువెళుతుందో.. అంటూ సాగిన పాట ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సాంగ్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా కనిపించనున్నారు. 96 రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా సక్సెస్ ను అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఫిబ్రవరి 7 న ఈ చిత్రం విడుదల కానుంది. 

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా లో ముందుగా హీరో గా అల్లు అర్జున్ ను అనుకున్నారట..ఇందు కోసం దిల్ రాజు రాళ్లు వేయడం మొదలుపెట్టాడు. ఒపీనియన్ తీసుకోవడానికి అని చెప్పి బన్నీకి ఈ సినిమాను చూపించాడు. బాగుంది అంటే చేయమని అడగొచ్చని దిల్ రాజు ప్లాన్. అయితే బన్నీ చూసి బాగుంది.. ప్రొసీడ్ అన్నాడే కానీ ఇంకేం మాట్లాడలేదు. దాంతో బన్నీ లిస్ట్ లోంచి వెళ్ళిపోయాడు. 

 

ఆ తర్వాత నానికి చూపిస్తే ఎందుకు ఇలాంటి క్లాసిక్ ను తీయడం. వద్దు అన్నాడట.అలా అన్నప్పుడు ఈ సినిమాలో నటిస్తా వా అని అడగలేక డ్రాప్ అయ్యాడట దిల్ రాజు..ఆ క్రమంలోనే శర్వానంద్ ను అడగగా అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలా సినిమా మొదలైంది.. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు.. 7 న విడుదల కానున్న ఈ సినిమా పై అందరూ భారీ అంచనాలుపెట్టుకున్నారు మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: