కొంతకాలం క్రితం టాప్ హీరోల సినిమాలకు కథలు అందిస్తూ టాప్ రైటర్ గా ఒక వెలుగు వెలిగిన కోన వెంకట్ ప్రస్తుతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలు వ్రాయలేక పోవడంతో కోన వెంకట్ కు రచయితగా అవకాశాలు బాగా తగ్గి పోయాయి. ఇలాంటి పరిస్థితులలో మారుతున్న పరిణామాలను గ్రహించిన ఈ రచయిత ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. 

లేటెస్ట్ గా అనుష్క తో తీసిన ‘నిశ్శబ్దం’ మూవీ విడుదల తరువాత తిరిగి అతడి హవా ప్రారంభం అవుతుందని కోన వెంకట్ గంపెడు ఆశలతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇతడు లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతడి ద్వంద వైఖిరి బయటపడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ముందు కోన వెంకట్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ నిజం అయితే చంద్రబాబు మోసకారి అనీ పవన్ కు అవగాహనా రాహిత్యం ఎక్కువ అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు పవన్ జగన్ లా రాష్ట్రం అంతా పాద యాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకోగాలడా అంటూ ఎదురు ప్రశ్నలు వేసాడు. 

అయితే ఇప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకుని సినిమాలు చేస్తున్న పరిస్థితులలో తాను పవన్ గురించి గతంలో అన్న మాటలు మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని ప్రస్తుతం దిగజారిపోతున్న రాజకీయ విలువలను నిలబెట్ట గల వ్యక్తి పవన్ మాత్రమే అనీ కామెంట్ చేయడమే కాకుండా సమాజానికి మేలు చేయడానికే తిరిగి పవన్ సినిమాలలో నటిస్తున్నాడు అంటూ మితిమీరిన పొగడ్తలు పొగిడాడు. దీనితో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడమే జీవిత ధ్యేయంగా గతంలో చెప్పుకున్న కోన వెంకట్ ఇప్పుడు మళ్ళీ పవన్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అంటూ జోక్స్ పడుతున్నాయి. కోన వెంకట్ అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరిని చూసి పవన్ మాత్రమే కాకుండా అతడి అభిమానులు కూడ షాక్ అవుతున్నట్లు సమాచారం..  

మరింత సమాచారం తెలుసుకోండి: