తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఢీ’  ప్రోగ్రామ్ 11 సీజన్లు కంప్లీట్ చేసుకొని 12వ సీజన్లో అడుగుపెట్టింది.  దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో ఇది. ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మందిని డాన్సర్లతో పాటు డాన్స్ మాస్టర్స్‌ను చేసింది. తెలుగులో ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో ఇది. ఇక జబర్దస్త్ లో నాగబాబు-రోజా కాంబినేషన్ ఎలాంటిదో ఢీ షోలో శేఖర్ మాస్టర్-ప్రియమణి కాంబినేషన్ అలాంటిది. అయితే ఇటీవ‌ల ప్రియ‌మ‌ణి ఈ షో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే.

 

అయితే మ‌ళ్లీ తాజాగా ఢీ షోలో జడ్జిగా రీఎంట్రీ ఇచ్చిన ప్రియమణి మరోసారి తన బోల్డ్ డెసిషన్స్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. వాస్త‌వానికి టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు పొదుపైన ఆచ్ఛాదనలతో సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. కేవలం గ్లామర్ తోనే కాదు. తన జడ్జిమెంట్, బోల్డ్ కామెంట్స్ తో ఫేమస్ అయిన ప్రియమణి అంటే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. జాతీయ ఉత్తమనటి అయిన ప్రియమణి.. కేవలం ఉత్తమ చిత్రాలకే పరిమితం కాకుండా, కమర్షియల్ చిత్రాల్లో సైతం తన అందచందాలతో ఆక‌ట్టుకుంది.

 

పెళ్లి అయినప్పటి నుంచి వెండితెరకు దూరమైన ఈ భామ బుల్లితెరపై ప్రస్తుతం హోస్ట్ గా దర్శనమిస్తోంది. అయితే ఈ భామ తాజాగా ఢీ షో మ‌ధ్య‌లో ఓ కంటెస్టెంట్ చేసిన పెర్ఫార్మెన్స్ కు ఏం చేయాలో అర్థం కాక.. తన జడ్జిమెంట్ టేబుల్ మీదకు ఎక్కి నిలబడి చప్పట్లు కొట్టి సంచలనం సృష్టించింది. గతంలో ఢీ షోలో జడ్జీలు కేవలం నిలబడి చప్పట్లు కొట్టేవారు. కాని, ప్రియ‌మ‌ణి మాత్రం ఏకంగా టేబుల్ పైకి ఎక్కి మరీ చప్పట్లు కొట్టి కంటెస్టెంట్లను ప్రోత్స‌హించింది. దీంతో ప‌క్క‌న ఉన్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు కూడా అస‌లు ప్రియ‌మ‌ణి ఏం చేస్తుందో తెలియ‌క ఒక్క నిమిషం పాటు షాక్‌లో అలాగే చూస్తూ ఉండిపోయారు. అలాగే అక్కడ ఉన్న చాలా మందికి ప్రియ‌మ‌ణి చేసిన ప‌నికి షాక్‌కు గుర‌య్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: