పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ‘పింక్’ రీమేక్ లో నటించడం వాస్తవానికి పవన్ అభిమానులకు కూడ ఏమాత్రం నచ్చడం లేదు. ఈ మూవీని  ఇప్పటికే బాలీవుడ్ కోలీవుడ్ లలో విడుదల అయిపోవడంతో ఈ మూవీని అనేక మంది ఇప్పటికే చూసారు. దీనితో ఈ మూవీ కథలో కొత్తగా చెప్పే విషయాలు ఏమి ఉంటాయి అంటూ పవన్ అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నారు. 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈ మూవీ బడ్జెట్ కు సంబంధించి ఇప్పుడు బయటకు లీక్ అవుతున్న వార్తలు పవన్ అభిమానులకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని దిల్ రాజ్ కేవలం 20 కొట్లలో పూర్తి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీలో నటిస్తున్న అంజలి నివేదా థామస్ లకు తక్కువ పారితోషికాలు ఇవ్వడమే కాకుండా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న వేణు శ్రీరామ్ కు పారితోషికం లేకుండా కేవలం నెల జీతాలు మాత్రమే ఇస్తున్నట్లు టాక్. దీనితో ఈ సినిమాకు పని చేస్తున్న అందరికీ తక్కువ పారితోషికాలు ఉండటంతో ఈ మూవీ బడ్జెట్ 20 కోట్లు దాటడం లేదు అని అంటున్నారు. 

దీనికితోడు ఎక్కువ భాగం కోర్టు హాల్ సెట్ లోనే జరిగే నేపధ్యంలో ఈ మూవీ సెట్స్ నిమిత్తం కూడ పెద్దగా ఖర్చులు లేవు. అదేవిధంగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి పాటల కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేక పోవడంతో ఈ మూవీ బడ్జెట్ ఖర్చు పెడదామన్నా అవకాశం లేకుండా అయింది. అయితే పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ పై 100 కోట్ల బిజినెస్ చేసి 50 కోట్లు పారితోషికం ఇచ్చినా తనకు 30 కోట్ల లాభం మిగులుతుందని దిల్ రాజ్ వేసిన లెక్కలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడంతో ఇలాంటి ప్రాజెక్ట్ లో పవన్ ఎందుకు చిక్కుకున్నాడు అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: