విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదల అయ్యే సమయానికి సంక్రాంతి సినిమాల మ్యానియా ముగిసిపోతుందని దీనితో తన సినిమాకు ఎదురుండదని విజయ్ దేవరకొండ భావించాడు. అయితే ఇప్పుడు మహేష్ బన్నీలు తమ సంక్రాంతి సినిమాలకు సంబంధించి లేటెస్ట్ గా మార్చుకున్న వ్యూహాలు విజయ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకి ‘అల వైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో ఈ మూవీ 50 రోజుల వరకు వీలైనన్ని ఎక్కువ సెంటర్లలో కొనసాగించి ‘అల వైకుంఠపురములో’ మూవీ 50 రోజుల ప్రదర్శన సెంటర్ల విషయంలో కూడ ఒక రికార్డును క్రియేట్ చేయాలని అల్లు కాంపౌండ్ భావిస్తున్నట్లు టాక్. ఈ విషయాలు తెలుసుకున్న మహేష్ కూడ తన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడ సక్సస్ అని తెలియ చెప్పడానికి వీలైనన్ని ఎక్కువ సెంటర్లలో ఈ మూవీని 50 రోజుల వరకు కొనసాగించాలని భావిస్తున్నట్లు టాక్. 

దీనితో చిన్న పట్టణాలలోని ధియేటర్లలో రెండు ధియేటర్లు ‘అల’ కు ‘సరిలేరు’ కు బంధింపబడి ఉంటాయి. ఇక ఎల్లుండి విడుదల కాబోతున్న ‘జాను’ సినిమాకు కూడ వీలైనన్ని ఎక్కువ ధియేటర్లు ఇస్తున్న నేపధ్యంలో ఈ మూవీ ఫలితం తేలిపోయినా రెండవ వారమే ఈ సినిమాను తీయరు. దీనితో  చిన్న సెంటర్లలో విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు ధియేటర్ల సమస్య ఏర్పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఓపెనింగ్ కలక్షన్స్ రికార్డులు అత్యంత కీలకంగా మారడంతో ఇలా తక్కువ ధియేటర్లతో విడుదల అయ్యే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కలక్షన్స్ రికార్డులను ఎలా బ్రేక్ చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి విజయ్ దేవరకొండకు మహేష్ తో మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా మహేష్ వంశీ పైడిపల్లిమూవీ ప్రాజెక్ట్ లో విజయ్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో విజయ్ సినిమాకు ‘సరిలేరు అడ్డుపడటం అత్యంత ఆశ్చర్యం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: