టాలీవుడ్ లోకి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  ఈ మూవీ రైతు మెసేజ్ తో ఉండటంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  అంతే కాదు ఈ మూవీలో మాస్ ఆడియన్స్ కి తగ్గట్టుగా అన్ని ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  మరో విశేషం ఏంటేంటే  మెగాస్టార్ కి ఈ మూవీ 150వ ది కావడం.. అది కూడా సూపర్ హిట్ కావడం అన్నీ కలిసి వచ్చాయి. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ లో నటించారు.  ఈ మూవీ అనుకున్న అంచనాలు అందుకోలేక పోయింది. భారీ పెట్టుబడితో పాప్ ఇండియా మూవీగా తెరకెక్కింది.

 

రిలీజ్ అయిననాలుగు భాషలు తెలుగు, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్ మొదలైంది.  దేవాలయాల మాఫియాకు సంబంధించిన ఈ మూవీ లో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారట. 151 సినిమాల సుదీర్ఘ సినీ ప్రయాణం.. అశేష ప్రజా అభిమానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కథలు విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి చిరంజీవి ఒక లేడీ డైరెక్టర్ కు పదే పదే నో చెప్తున్నారంట.

 

రీసెంట్ గా 'ఓ బేబి' సినిమాతో సక్సెస్ అందుకుంది లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి. మెగా హీరోతో సినిమా చేద్దామని ప్రయత్నిస్తుంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కోసం నందిని ఒక కథను సిద్ధంచేసుకుని చిరంజీవికి వినిపించారట, అయితే ఆ కథలో కొన్ని మార్పులు చేయాలనీ నందినిని కోరాడట చిరంజీవి. నందిని రెడ్డికి టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్నవిషయం తెలిసిందే. ఆమె గనక మంచి కథ వినిపించి మెగాస్టార్ తో సినిమా తీస్తే ఒక ట్రెండ్ సృష్టించినట్లే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: