కోలీవుడ్ లో ఈ మద్య వరుస సినిమాలతో తనదైన కామెడీ ఇమేజ్ సంపాదించాడు కమెడియన్ యోగిబాబు. వడివేలు తర్వాత సంతానం.. ఆయన తర్వాత యోగిబాబు మంచి స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. తెలుగు లో ఒకప్పుడు బాబు మోహన్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో అలాంటి రూపం ఉన్న యోగిబాబు తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ బిజీగా మారిపోయాడు. తమిళ స్టార్ కమెడియన్, రజినీ కాంత్ సినిమాలతో పాపులర్ అయిన యోగిబాబు వివాహం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన మంజు భార్గవిని బుధవారం నాడు వివాహం చేసుకున్నారు యోగిబాబు.
ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం తమిళనాడు తిరుతనిలో ఈ వివాహం జరిగింది. కాకపోతే యోగి బాబు ఈ విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే ఈ వివాహం కుటుంబం ఏర్పాటు చేసిన వివాహం అని.. రిసెప్షన్ను వచ్చే నెలలో చెన్నైలో నిర్వహించనున్నట్టు తమిళ మీడియా తెలిపింది. ఈ మద్య మురగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన దర్బార్లోనూ కీలకపాత్ర పోషించారు యోగిబాబు.
ప్రస్తుతం తమిళ్లో బిజీ కమెడియన్గా అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్గా టాప్ ప్లేస్లో ఉన్నారు యోగిబాబు. అంతే కాదు ఈ మద్య యోగిబాబు కమెడియన్గా నటిస్తూనే హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలనే దక్కించుకున్నాయి. తాజాగా ‘కాక్టేల్’పేరుతో ఒక సినిమా చేసాడు. ఈ మూవీలో అతను హిందువులు ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ఎక్కువగా ఆరాధించే కుమారస్వామి వేషంలో కామెడీగా దర్శనమిచ్చి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాడు. తమ ఆరాద్య దైవంగా కొలిచే కుమార స్వామిని కించపరిచే విధంగా ఉందని తమిళ తంబీలు సీరియస్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఏది ఏమైనా తమ అభిమాన కమెడియన్ ఓ ఇంటివాడైనందుకు అభిమానులు సంతోషంలో ఉన్నారు.