టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల రిలీజ్ అయిన ఆయన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని, కలెక్షన్స్ ను అందుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల గ్యాప్ తరువాత మహేష్ బాబు మంచి కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ ఉన్న రోల్ లో నటించడంతో పాటు సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్, మరొక రెండు నెలల తరువాత తిరిగి రాగానే తన తదుపరి సినిమాలో జాయిన్ అవుతారు. 

 

మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా విషయమై నేడు ఒక సంచలన వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఇక ఆ వార్త ఏంటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారని, అయితే వాటిలో ఒకటి మాస్ గ్యాంగ్ స్టర్ పాత్ర అయితే, మరొకటి క్లాస్ గా సాగె లెక్చరర్ పాత్ర అట. అయితే మాస్ క్యారెక్టర్ కోసమే ప్రస్తుతం మహేష్ బాబు గడ్డం పెంచుతున్నారని, ఇక రజినీకాంత్ కు బాషా మాదిరిగా మహేష్ బాబు కెరీర్ లో ఆ రేంజ్ లో నిలిచిపోయి సినిమా గాదర్శకుడు వంశీసినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. 

 

మహర్షి మంచి హిట్ కొట్టినప్పటికీ ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవడంతో, ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా జోడించనున్నాడట దర్శకుడు. ఇక మహేష్ పవర్ఫుల్ రోల్ లో నటించబోయే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుందని, అందులో ఒకరు కియారా అద్వానీ అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ ఇవి కనుక నిజమే అయితే, రజిని బాషా రేంజ్ లో మహేష్ ను కూడా ఆయన ఫ్యాన్స్ అదిరిపోయే రోల్ లో చూడవచ్చన్నమాట....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: