టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ మూవీ తెలుగు రీమేక్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నటించిన అజ్ఞాతవాసి అనంతరం సినిమాలకు విరామం ప్రకటించి పాలిటిక్స్ లో బిజీ అయిన పవర్ స్టార్, మళ్ళి ప్రస్తుతం ఫ్యాన్స్ కోసం సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తరువాత పవన్, క్రిష్ కాంబినేషన్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఆరంభం అయింది. 

 

అయితే ఈ షూట్ లో పవన్ పాల్గొనడానికి మరికొంత సమయం పడుతుందట. ఇక ఈ సినిమా రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ఇకపోతే వీటి రెండిటి తరువాత తనతో గబ్బర్ సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు పవన్. ఇప్పటికే హరీష్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయమై కసరత్తు ఆరంబించినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్

 

తెలంగాణ యోధుడి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినపడుతోంది. మంచి పవర్ఫుల్ గా సాగె ఈ పాత్రలో పవన్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని, అలానే తమ ఇద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మాదిరిగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం హరీష్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నటించబోయే హీరోయిన్, తదితరుల ఎంపిక అతి త్వరలో మొదలవుతుందని, జూన్ లో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాని 2021 వేసవికి  రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. మొత్తంగా పవన్ వరుసగా ఇలా సినిమాలు ప్రకటిస్తూ ఉండడం నిజంగా ఆయన ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: