దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదలవుతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర‌మే అని చెప్పాలి. 

 

ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను చూపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. అలాగే  ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ యాక్ట్ చేస్తోంది. మ‌రో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారు. 

 

ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల లేట్ అవుతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమా అనుకున్న టైం కి అవ్వడం లేదని చిరాకులో ఉన్న‌ట్టు.. సినిమా కోస‌మే చాలా టైం వేస్ట్ అయ్యిందంటున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ‌.. దీంతో ఇక త‌న నెక్ట్స్ సినిమా మ‌రింత లేట్ అవుతుంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తుంది. ఇక ఒకవేళ చెప్పిన డేట్‌లో రిలీజ్ కాకపోతే.. అభిమానుల్లోనూ అస‌హ‌నం వ్య‌క్తం అయ్యే ఛాన్స్ లేక‌పోలేదు. మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తాడు అన్న చ‌ర్చ‌లు విసృతంగా సాగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: