టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మొన్న సంక్రాంతి పండుగా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, సంక్రాంతి సెలవుల కారణంగా మరింత బాగా వసూళ్లు అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించారు. ఇకపోతే సరిగ్గా ఆ సినిమా తరువాతి రోజున రిలీజ్ అయిన అలవైకుంఠపురములో మూవీ కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా సంపాదించింది. సంక్రాంతి పండుగా కావడం ఈ సినిమాకు కూడా మరింతగా అద్భుతంగా కలెక్షన్స్ వచ్చేలా చేసింది. 

 

బన్నీ సరసన పూజ హెగ్డే నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇకపోతే రిలీజ్ కు ముందు నుండి, అనగా పాటల విడుదల సమయం నుండి ఈ రెండు సినిమాల మధ్య మొదలైన కోల్డ్ వార్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇక తమ సినిమాలు తొలిరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దగ్గరి నుండి మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ ఈ రెండు సినిమాల నిర్మాతలు కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేయడం, మొదట్లో ప్రేక్షకులకు ఆసక్తిగా అనిపించినా, రాను రాను అది వారి పట్ల హాస్యస్యాస్పదంగా తయారయింది. ఇవాళ ఎవరి పోస్టర్ వేశారు, రేపు ఎవరిది వేస్తారు అంటూ కొందరు ఆడియన్స్ బహిరంగంగానే రెండు సినిమాల మీద జోక్స్ వేయడం మొదలెట్టారు. 

 

ఇకపోతే ఇటీవల తమ సినిమాకు ఇకపై కలెక్షన్స్ ఫిగర్స్ ప్రకటించడం ఉండదంటూ సరిలేరు టీమ్ ఒక ప్రెస్ మీట్ లో ప్రకటించడంతో అల టీమ్ కూడా ఒకింత సైలెంట్ అయింది. అయితే మొన్న సరిలేరు మూవీ యూనిట్, తమ సినిమా 25 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి 2 విజయాన్ని అందుకుందని పోస్టర్ రిలీజ్  చేయగా, నిన్న అల టీమ్ కూడా అదే విధంగా పలు ప్రాంతాల్లో తమ సినిమా కూడా నాన్ బాహుబలి 2 రికార్డ్స్ కొట్టింది అంటూ పోస్టర్ వేశారు. దీనితో మళ్ళి ఆడియన్స్ లో అసహనం మొదలైంది. మొన్నటి వరకు ఇద్దరూ ఈ పోస్టర్ల గోల ఆపేసారుగా, ఓహో మళ్ళి సడన్ మూడోచ్చిందా ఏంటి, మళ్ళి ఈ పోస్టర్ల వార్ మొదలెట్టారు అంటూ సరదాగా కామెంట్స్ చేయడం మొదలెట్టారు. మరి ఇకనైనా ఈ రెండు సినిమాల మధ్య ఈ వార్ ఎప్పుడు ఆగుతుందో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: