టైగర్ ష్రాఫ్, దిశాపఠానీ స్టోరీ యూటర్న్ తీసుకుంది. పక్కా కమర్షియల్ సినిమాలా ఫుల్ ట్విస్టులతో రన్ అవుతోంది. నీకునాకు కటీఫ్  అని చెప్పుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు బ్రేకప్ కు బ్రేకులేస్తోంది. విడిపోయి సాధించేమిటి.. కలిసుంటే కలదు సుఖం అన్నట్టు మళ్లీ డ్యూయెట్ పాడుకుంటున్నారు లవ్ బర్డ్స్.

 

టైగర్ ష్రాఫ్-దిశాపఠానీ విడిపోయారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా ప్రేమించుకుంటోన్న వీళ్లిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని బాలీవుడ్ మొత్తం చెప్పుకుంటోంది. దీంతో అన్ని బాలీవుడ్ ప్రేమల్లాగే వీళ్ల ప్రేమ కథ కూడా కంచికి చేరిందని అంతా అనుకున్నారు. కానీ విళ్లిద్దరు సడన్ గా ఓ రెస్టారెంట్ ముందు వాలిపోయి.. బాలీవుడ్ ను కన్ ఫ్యూజ్ లో పడేశారు. 

 

దిశాపఠానీ గ్లామర్ డోస్ పెంచినా, పెర్ఫామెన్స్ తో మెప్పించినా సరైన స్టార్ డమ్ అందుకోలేకపోయింది. దీంతో కెరీర్ పై కాన్సన్ ట్రేట్ చేసేందుకు కొన్నాళ్లు టైగర్ తో చాటింగ్ లు, మీటింగులకు దూరంగా ఉండాలనుకుంది దిశ. దీనికి టైగర్ కూడా ఒకే చెప్పాడట. ఈ గ్యాప్ నే బ్రేకప్ అనుకున్నారని టైగర్ స్నేహితులు చెబుతున్నారు. 

 

కెరీర్ కోసం ఎంత గ్యాప్ మెయింటైన్ చేద్దామనుకున్నా కుదరట్లేదట. అందుకే సినిమాలకు, లవ్ కు లింక్ పెట్టకుండా మునుపటిలా చేతిలో చేయేసుకొని తిరగాలని డిసైడ్ అయిందట కపుల్. దీంతో బాలీవుడ్ లో వీళ్ల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆల్ రెడీ దిశా పఠానీని ఫ్యామిలీకి పరిచయం చేశాడు టైగర్ ష్రాఫ్. ఇపుడు విడిపోయి మళ్లీ కలిశారు. ఇక తర్వాత భార్య పోస్ట్ ఇవ్వడమే మిగిలిందని మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. మొత్తానికి దిశాపఠానీ, టైగర్ ష్రాఫ్ లు తమపై వస్తున్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఏకంగా రెస్టారెంట్ ముందు కనపడి.. అందరిలా తాము కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: