దేశంలోనే నెంబర్ వన్ నెట్ వర్క్‌గా పేరొందిన ఎయిర్ టెల్‌ పై టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హగ్డే గతంలో భగ్గుమంది. ఎయిర్ టెల్ ఓ చెత్త సర్వీస్ అంటూ ట్వీట్ చేసింది. ఈ నెట్ వర్క్‌తో నేను విసిగిపోయానని.. తప్పుడు బిల్లులు వేస్తుంటారు.. దీనంత చెత్త కస్టమర్ సర్వీస్, చెత్త వ్యవస్థ ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేసింది. చాలా రోజులుగా ఎయిర్ టెల్‌ని వాడుతున్నానని.. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని.. ఈ సంస్థ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుని వేరే నెట్వర్క్ ని చూసుకోండి. నా జీవితంలో ఇంతటి చెత్త అనుభవం నాకెప్పుడూ ఎదురుకాలేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్ టెల్‌ను ట్యాగ్ చేసి మరీ ట్వీట్ వదిలింది పూజా హెగ్డే. 

 

పబ్లిక్ అయితే లైట్ తీసుకుంటారు కాని.. ఇలాంటి పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఎయిర్ టెల్ సంస్థ కూడా వెంటనే స్పందించారు. ‘హాయ్ పూజ. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మీ సమస్య తీరేలా చూస్తాం. ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక పూజా పాపకు బాగానే ఫాలోయింగ్ ఉంటటంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో ఎయిర్ టెల్ సంస్థ యుద్ధప్రాతిపదికన ఆమె సమస్యను పరిష్కరించారు. 

 

దీంతో చెత్త చెదారం అంటూ తిట్టన పూజే......  తన సమస్యను పరిష్కరించిన ఎయిర్ టెల్‌ కు థాంక్స్ చెప్తూ మరో ట్వీట్ చేసింది. మొన్న చెత్త వ్యవస్థ అని తిట్టిన నోరుతోనే ఇప్పుడు ఫెంటాస్టిక్ అంటూ.. నా కంప్లైంట్ మిగిలిన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడిందని భావిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది పూజా. 

 

ఆమె సెలబ్రిటీ కాబట్టి ఎయిర్ టెల్ వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారు.. సాధారణ వినియోగదారులైన ఒకటి నొక్కండి.. రెండు నొక్కండి అంటూ నంబర్లు నొక్కిస్తూ 12 రూపాయిల బిల్ వేసి చివర్లో చేతులు ఎత్తేస్తారు అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: