అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి... ఎంతో మంది స్టార్ హీరోల సరసన మెరిసి... ఎన్నో సంచలన విజయాలను  తన ఖాతా లో వేసుకున్నది  ఈ అమ్మడు. తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేసింది.  తన అదిరి అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తన కెరీర్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరుగా  సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ వైవిధ్యత్మక మూవీ అయినా సైజ్ జీరో సినిమా చేసింది అనుష్క. ఆ సినిమా కోసం ఈ అమ్మడు భారీగా లావు  పెరిగింది. లావు పెరిగింది కానీ తగ్గించడానికి మాత్రం నానా కష్టాలు పడింది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో... ఎక్కడ వెండి తెరపై కనిపించలేదు. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాలో నటించినప్పటికీ మరే  సినిమాలో మాత్రం అనుష్క శెట్టి కనిపించలేదు. 

 

 

 ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా ఏప్రిల్ రెండో తేదిన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో ముందుకు సాగుతుందని ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఓ మర్డర్  చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఈ నిశ్శబ్దం అని టాక్  వినిపిస్తోంది. అయితే సినిమా మొత్తం మర్డర్  చేసింది ఎవరు అనే కోణంలో... ఈ సినిమా కథ సాగుతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మర్డర్  చేసేది అనుష్కనేనని .... ఈ విషయాన్ని సినిమాలో క్లైమాక్స్ లో ట్విస్ట్ గా  చేస్తారని అదే సినిమా కథ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది అంటూ టాక్ నడుస్తుంది. 

 

 

 కాగా ఇప్పటికే ఎన్నో ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు తాజాగా నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా  ఈ సినిమా ఏప్రిల్  రెండవ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక సినిమా తర్వాత బాగా లావైపోయినా అనుష్క ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాకగా  వచ్చిన భాగమతి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నిశ్శబ్దం  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన అనుష్క శెట్టి ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: