మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యాన్స్ కె కాదు ప్రేక్షకులందరికి విపరీతమైన అభిమానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ ఫ్యామిలీ నుండి ఏ హీరో ఇండస్ట్రీకి వచ్చిన రెండు సినిమాలతో జనాలలో మంచి క్రేజ్ ని దక్కించుకుంటారు. బన్ని, శిరీష్, వరుణ్ తేజ్ ...ఇలా అందరిని చూసిందే. ఇక సాయి ధరం తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం తోనే తనేంటో నిరూపించుకున్నాడు. మేనమామ లాగా డాన్స్ లో యాక్టింగ్ లో మంచి ఈజ్ ఉందని పెద్ద స్టార్ అవుతాడని ఒక్క సినిమాతో తెలిసేలా చేశాడు. ఇక అంత పెద్ద మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" అనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం కాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ స్నేహితుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ మొదటివారంలో విడుదలకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

ఇక వైష్ణవ్ తేజ్ మొహం దాచేసి సముద్రం వైపు చూస్తూ, గెలిచానన్నట్టుగా చేతులు చాపుతూ ఉన్న స్టిల్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి మరో అప్డేట్ తాజాగా బయటకి వచ్చింది. ఫస్ట్ వేవ్ పేరుతో ఈ సినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ ఫస్ట్ వేవ్ కూడా చాలా ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. సముద్రం తీరాన ఉన్న వైష్ణవ్ తేజ్ బేబమ్మా అని అరుస్తూ చేతులు పైకి చాచగానే బస్ లో ఉన్న హీరోయిన్ ని చూపించారు. అది కూడా ఆమె మొహం పూర్తిగా కనబడకుండా గాలికి ఎగురుగున్న చున్నీతో ఆమె మొహానికి అడ్డుపడుతూ ఉంటుంది. ఈ చిన్న వేవ్ లోనే కాన్సెప్ట్ ని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. 

 

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ పోస్టర్ లోనూ హీరో, హీరోయిన్ల మొహాలు చూపించలేదు. ఇప్పుడు ఈ వేవ్ లోనూ అదే ఫాలో అయ్యారు. ఈ రకంగా చూస్తుంటే మొత్తానికి వైష్ణవ్ తేజ్ ఏదో కొత్తదాన్ని క్రియేట్ చేయబోయేలా ఉన్నాడని చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక సుకుమార్ క్యాంపస్ నుండి వచ్చిన దర్శకుడు కాబట్టి సినిమా అద్భుతంగా మలిచాడని ఇప్పటికే చిత్ర యూనిట్ వాళ్ళు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: