శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల అవుతున్న సందర్భంగా సమంత ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘జాను’ సినిమాలో సినిమా అంతా ప్రధానంగా రెండు క్యారెక్టర్స్ మధ్యనే సాగుతుందని ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాలలో సీన్లో ముప్పై, నలభై మంది ఆర్టిస్టులతో పనిచేశాను. కానీ..వాటికి ఈ సినిమా పూర్తి గా డిఫ్రెంట్. ఈ సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్ పెర్ఫామెన్సే మెయిన్గా ఉంటుంది. అదే సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది... అన్నారు. ఇక జాను సెట్ లో అడుగు పెట్టిన మొదటిరోజునే ఈ సినిమాతో ఏదో మేజిక్ జరుగుతుందని అర్థమైంది...అంటూ సమంత తన అనుభవాలను తెలిపింది.
ఇక త్రిష తో నన్ను నేను అసలు కంపేర్ చేసుకోలేదని కంప్లీట్ గా తన పర్ఫార్మెన్స్ కి మాచ్ అవకుండా నా స్టైల్ లో నటించానని ఎవరు నన్ను ఈ సినిమా నటన విషయంలో త్రిష తో పోల్చుకోలేరని నమ్మకంగా వెల్లడించింది. ‘జాను’ సినిమా కాన్సెప్ట్ను అర్థం చేసుకుని నా తరహాలో నటించాను. డైరెక్టర్ ప్రేమ్ నా పెర్ఫామెన్స్ త్రిషతో పోల్చితే డిఫరెంట్గా ఉందని అన్నారు. సినిమా చూసిన వారు కూడా నేను డిఫరెంట్ వేలో నటించానని ఒప్పుకుంటారు...అంటూ తన ఆశాభావాన్ని వ్యక్తపరచారు.
సినిమాలో మా ఇద్దరి పెర్ఫామెన్స్లే ప్రధానం. ఒకరి పెర్ఫామెన్స్ పై మరొకరి పెర్ఫామెన్స్ ఆధారపడి ఉంటుంది. బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ఒకరినొకరు ప్రొత్సహించుకున్నాం. రామ్ పాత్రలో శర్వా తప్ప మరొకరిని ఊహించుకోలేను. మరొకరు ఉండుంటే ఈ మేజిక్ రీ క్రియేట్ అయ్యేది కాదేమో...శర్వానంద్ పర్ఫార్మెన్స్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ ల మీదా ఆసక్తిని చూపిస్తున్నారు. సక్సస్ ఫుల్ ఫ్యామిలీ మాన్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో సమంత ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో ఇటువంటి పాత్ర చేయలేదు సమంత. ఇకపై కూడా తనకి ఆసక్తికరంగా అనిపిస్తే సమంత వెబ్ సిరీస్ లను కంటిన్యూ చేస్తానని తెలిపింది.