ప్రస్తుతం చైనా ను కరోనా  వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే దాని దెబ్బకు ఇప్పటికి వరకు 500మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీని ప్రభావం హాంకాంగ్ ,థాయిలాండ్ వంటి  పొరుగు దేశాల పై కూడా పడింది దాంతో చైనా నుండి ఎగుమతులు ,దిగుమతులకు  రద్దయ్యాయి. ఇక  కరోనా  ప్రభావం కింగ్ ,నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ పై కూడా పడింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా తదుపరి షెడ్యూల్ వచ్చే వారం థాయిలాండ్ లో జరగాల్సి వుంది. 
 
సుమారు 20రోజుల పాటు అక్కడ ఓ కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు కరోనా  ప్రభావం తో  ఆషెడ్యూల్ ను రద్దు చేసింది చిత్ర బృందం. ఇక ఈషెడ్యూల్ ను థాయిలాండ్ లో కాకుండా  మరో చోట ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నూతన దర్శకుడు సాల్మన్ డైరెక్షన్ లో రియాలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున , విజయ్ వర్మ అనే  ఎన్ ఐ ఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 2009 లో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.
 
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయామీ కేర్  ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇందుకోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా  తీసుకుంది. త్వరలోనే  ఆమె ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది.  మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై  నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది  సమ్మర్ లో విడుదలకానుంది. ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్న నాగ్ కు ఈ చిత్ర విజయం కీలకం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: