సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. 6 నెలలుకు ఓ సినిమా తీసి ప్రేక్షకులు మరింత దగ్గరవుతున్నాడు మహేష్ బాబు.. అలాంటి మహేష్ బాబు ఒక్క సినిమాలలోనే కాదు బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నాడు. ఎక్కిడిక్కడ అదిరిపోయే ఐడియాలతో తనకంటూ ఓ కోటాను నిర్మించుకుంటున్నాడు మహేష్ బాబు.
అటు సినిమాలు.. ఇటు అడ్వేర్టైజ్ మెంట్లు.. బుల్లితెరలో ప్రత్యేక ప్రోమోలు అబ్బో అబ్బో.. ఇలా ఒకటి కాదు.. ఎన్నో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మహేష్ బాబు. అయితే ఒక్క మహేష్ బాబు మాత్రమే కాదు కుటుంబంత కమర్షియల్ యాడ్స్ నటించేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు బిజినిస్ పై ఓ గమ్మత్తైన పుకారు పుట్టుకొచ్చింది.
అది ఏంటి అంటే.. మహేష్ బాబు.. విశాఖపట్నంలో సెటిల్ అవుతున్నట్టు.. అక్కడ విశాఖలో భూములు కొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ ఇప్పటికే గుంటూరు జిల్లాలోనూ తెలంగాణలో వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ రంగారెడ్డి జిల్లాలోనూ భూములను కొన్నాడు.
ఇక ఇప్పుడు విశాకలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పరోక్షంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు భోగట్టా.. అయితే ఎక్కడ భూములు కొన్న తనకంటూ ఓ ప్రత్యేకంగా సినిమాలే కాకుండా ఇలా చిన్న చిన్నగా బిగ్ బి అయిపోడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరి విశాఖలో భూమలు కొన్నది ఎంతవరుకు నిజమో తెలియదు కానీ.. మహేష్ బాబు మాత్రం.. ఇటు సినిమాను.. అటు బిజినెస్ ను సరైన ట్రాక్ లో నడిపించేస్తున్నడు. అయితే ఇంకా విశాఖ భూములు కొనుగోలు.. అక్కడ సెటిల్ అవ్వడం అనేది ఎంత వరుకు నిజమో తెలియాల్సి ఉంది.