టాలీవుడ్ లోకి maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తర్వాత తెలుగు, తమిళ సినీ పరిశ్రమంలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా లో తన సహనటుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  వివాహం అనంతరం సమంత నటించే అవకాశం లేదని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.  కానీ విచిత్రం ఏంటేంటే సమంతకు పెళ్లిఅయిన తర్వాతనే వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటుంది.  అంతే కాదు ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ మంచి విజయాలు అందుకుంటుంది.  ఓ బేబీ, యూటర్న్ లాంటి సినిమాలు సమంతకు బాగా కలిసి వచ్చాయి.  ప్రస్తుతం శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా చిత్రం 'జాను'.

 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. 'జాను'  సినిమా అంతా ప్రధానంగా రెండు క్యారెక్టర్స్‌ మధ్యనే సాగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథా సినిమాల్లో నటించాను...కానీ జానూ మూవీలో ఓ ప్రత్యేకత ఉంది. ఇది మన జ్ఞాపకాలను తట్టి లేపే పాత్ర.. అందరి గుండెలకు హత్తుకునేలా ఉంది.

 

తొలిరోజే నాకు ఏదో మ్యాజిక్‌ జరుగుతుందని అర్థమైంది. ఆ మ్యాజిక్‌ ప్రతిరోజూ కంటిన్యూ అయ్యింది. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా  అలాంటి ఫీల్‌ అవుతారు. సవాళ్ళను ఎదుర్కొనే పాత్రలు చేసినప్పుడే అవి ప్రేక్షకుల హదయాల్లో నిలిచిపోతాయి.  కేవలం నటన అనేదే కాదు ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాల్లో నా ప్రవర్తన ద్వారా ఎవరైనా ఇబ్బంది పడ్డారా లేదా అనేది కూడా నేను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొని సర్ధుబాటు చేసుకుంటాను అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: