ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘కేజీ ఎఫ్ 2’ కూడ ఉంది. చరిత్ర సృష్టించిన ‘కేజీ ఎఫ్’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీని అక్టోబర్ లో కాని లేదంటే డిసెంబర్ లో కానీ విడుదల చేయాలని ఇప్పటి వరకు ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తూ వచ్చాడు. 


అయితే ఇప్పుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి మారడంతో ఈ ఏడాది జూలై 30న రాజమౌళి రిజర్వ్ చేసుకుని వదిలేసిన డేట్ కు ‘కే జీ ఎఫ్ 2’ విడుదల చేయాలని అప్పుడే ప్రశాంత్ నీల్ ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ‘బాహుబలి’ తరువాత ఒక చరిత్రను సృష్టించిన ‘కే జీ ఎఫ్’ ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీని వాడుకోవడం యాధృశ్చికం అనుకోవాలి.


కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళడమే కాకుండా ఈ మూవీలో హీరోగా నటించిన యాష్ ను నేషనల్ సెలెబ్రెటీ గా మార్చేసింది. ఈ మూవీలో నెగిటివ్ పాత్రలో చేస్తున్న సంజయ్ దత్ విలనీ ఈ మూవీ స్థాయిని మరొక రేంజ్ కి తీసుకు వెళుతుంది అని అంటున్నారు. 


‘కే జీ ఎఫ్’ పార్ట్ వన్ కథ ఎక్కడ ముగిసిందో ‘కే జీ ఎఫ్ 2’ కథ అక్కడ మొదలవుతుంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఈ జూలైకి ‘కే జీ ఎఫ్ 2’ విడుదల అయితే ఈ మూవీ పై ఉన్న అంచనాల రీత్యా ఈ సినిమాకు రికార్డ్ కలక్షన్స్ రావడం అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. దీనితో రాజమౌళి ఎంచుకున్న డేట్ ఇప్పుడు ‘కే జీ ఎఫ్ 2’ రిలీజ్ డేట్ గా మారుతూ ఉండటంతో జక్కన్న పరోక్షంగా ‘కే జీ ఎఫ్ 2’ మ్యానియాకు సహకరిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: