ఈ మద్య టాలీవుడ్ లో మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ హీరోలు, హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.  మాలీవుడ్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్   సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేషన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.  ఆ తర్వాత తెలుగు లో కొన్ని చిత్రాల్లో నటించిన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటుతున్నాడు. ఇక కేజీఎఫ్ మూవీతో కన్నడ హీరో క్రిష్ తెలుగు లో ఎంత మంచి పేరు సంపాదించారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి కలవడం... ఒకరితో ఒకరు ముచ్చటించుకోవడం ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని.. ఆనందాన్ని కలిగించాయి.  

 

దుల్కర్‌-యశ్‌ అనుకోకుండా బుధవారం ఓ జిమ్‌లో కలిశారు. ఇందులో భాగంగా వీరిద్దరూ సినిమాల గురించి సరదాగా ముచ్చటించారు.  నికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్  మాట్లాడుతూ.. యశ్‌ చాలా మంచి వ్యక్తి. నిన్ను కలవడం సంతోషంగా ఉంది బ్రదర్‌. నీ స్నేహం, ప్రేమాభిమానం, మాటలు నా హృదయాన్ని తాకాయి. త్వరలోనే నిన్ను మరోసారి కలవాలనుకుంటున్నాను. ‘కేజీఎఫ్‌2’.. రాకీ కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు.  తాజాగా దుల్కర్ సల్మాన్  పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

 

మరోవైపు ఫ్యాన్స్ ఈ యంగ్ హీరోలు ఇద్దరు ఒకతేరపై కనిపిస్తే ఆ సంబరమే వేరు అని అంటున్నారు. మీరిద్దరూ.. కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం యశ్‌.. ‘కేజీఎఫ్‌2’ సినిమాలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా షూటింగ్‌ ఇటీవల బెంగళూరులోని గ్లోబుల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో జరిగింది. ఇక దుల్కర్‌ ‘కురూప్‌’ సినిమాలో నటిస్తున్నారు. కేజీఎఫ్ 2 సైతం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: