నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ దారుణమైన ఫ్లాప్ టాక్ వచ్చింది.  గత ఏడాది క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ రెండు భాగాలుగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు డిజాస్టర్ టాక్ వచ్చాయి. ఆ తర్వాత ఏపిలో ఎన్నికలు రావడం బాలయ్య మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.  ఆ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు బాలకృష్ణ.  ఈ నేపథ్యంలో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ మూవీ కోసం బోయపాటి ఇప్పటికే వారణాసిలో లొకేషన్లను ఫైనల్ చేశారు.  

 

అయితే ఈ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తాయి.  మొత్తానికి ఆయన సరసన గతంలో నటించిన శ్రియ ను ఒక హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలోనూ బాలకృష్ణ విభిన్న అవతారాల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తోన్న బాలయ్య మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారట. వీటిల్లో ఒక రోల్ 15 నిమిషాల పాటు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుందని తెలిసింది.  ఈ అఘోర పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో బాలకృష్ణ యంగ్‌గా కనిపిస్తారు. ఒక సామాజిక సమస్య గురించి పోరాడతారని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.  

 

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.   తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీలో మరో హీరోయిన్ పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర కోసం నయనతారతో సంప్రదింపులు జరపడం, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని అంటున్నారు. కథలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార కనిపిస్తుందని చెబుతున్నారు.   భారీ విజయాలను అందుకున్నవారే. అలాంటి ఈ ఇద్దరూ బాలకృష్ణతో కలిసి నటించనుండటం విశేషం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: