టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా... ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న అన్ని పాత్రలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం రానా  విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో రానా ఓ వైవిధ్యత్మక  పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా  చిత్రీకరణ ఎప్పుడో పూర్తవ్వాలి కానీ   మధ్యలో రానా అనారోగ్యం కారణంగా విదేశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. గత కొంతకాలం క్రితం రానా మళ్ళీ తిరిగి రాగానే ఈ చిత్రీకరణ ప్రారంభమైంది. 

 


 ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు వైవిధ్యమైన నటనతో రానా అదరగొడితే సాయి పల్లవి కూడా తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటించడంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ  వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విరాటపర్వం సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు అని టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రియమణి ఈ చిత్రం షూటింగులో కూడా జాయిన్ అన్నట్లు తెలుస్తోంది. 

 

 అయితే ఒకప్పుడు అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ప్రియమణి కి... తర్వాత అవకాశాలు తగ్గాయి. ఇక ఇప్పుడు బుల్లితెరపై అలరిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడిప్పుడే అవకాశాలు దరి చేరుతున్నాయి . ఇకపోతే ప్రస్తుతం ప్రియమణి వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప  సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ప్రస్తుతం నారప్ప  సినిమాతో మరోసారి టాలీవుడ్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ప్రియమణి . అయితే ఒకే సమయంలో విరాటపర్వంలో రానాతో నారప్ప లో  వెంకటేష్ తో నటిస్తుండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా  ఒక సినిమాలో  అబ్బాయి మరో సినిమాలో బాబాయ్... ఇద్దరితో  కలిసి నటించే అవకాశం రావడం ఈ అమ్మడికి బాగా కలిసొచ్చే అంశమే. అంతేకాకుండా ఈ రెండు సినిమాలకు నిర్మాత సురేష్ బాబూ అవ్వడం అన్ని విధాలా కలిసి వస్తుందని... ప్రియమణి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: