హీరోగా భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్న నాగ శౌర్య ఇప్పుడిప్పుడే కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, లక్ష్మి రావే మా ఇంటికి, జాదూగాడు, కల్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద ఇలా ఎన్ని సినిమాలు చేసినా ఈయనకు ప్రత్యేకంగా మార్కెట్ తీసుకొచ్చిన సినిమా మాత్రం ఛలో. ఆ తర్వాత అమ్మమ్మగారిల్లు, నర్తనశాల అంటూ వచ్చి ఓ మోస్తరు క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక లవర్ బాయ్ పాత్రలు చేస్తూ వచ్చి.. ఒక్కసారిగా పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారిపోయాడు నాగశౌర్య. ఈయన నటించిన అశ్వథ్థామ సినిమా బాగానే హిట్ అయింది.
మరో విషయం ఏంటంటే ఈ సినిమా కథ నాగశౌర్యదే. అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు శౌర్య. గతంలో విజయ్ దేవరకొండ స్టార్డమ్పైనా వివాస్పద వ్యాఖ్యలు చేవారు వార్తల్లో నిలిచాడు. స్టార్ స్టేటస్ అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు శౌర్య. దీంతో అవి విజయ్ను ఉద్దేశించే అని ప్రచారం జరిగింది. అలాగే ఫిదా సినిమాతో వెలుగులోకి వచ్చిన నటి సాయిపల్లవిపై కూడా శౌర్య కామెంట్లు చేశాడు. సాయిపల్లవికి టైమింగ్ సెన్స్ లేదు. షూటింగ్కి తను సరైన సమయానికి రాకపోవటం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ వ్యాఖ్యానించాడు.
అయితే నాగశౌర్య చేసిన కామెంట్స్ను సాయిపల్లివి మాత్రం స్పోర్టివ్గా తీసుకుంది. దాంతో వివాదం సద్దుమణిగింది. అలాగే ఇటీవల ఛలో సినిమా విషయంలో మరో సారి వార్తల్లో నిలిచారు నాగశౌర్య. ఛలో సినిమాకు కథ రాసింది తానేనని.. అయితే అప్పుడు పేరు వేసుకోకుండా తప్పు చేసానని చెప్పాడు శౌర్య. మొత్తానికి ఛలో సినిమా కథ నాదేనని చెప్పి వెంకీ కుడుములకు షాక్ ఇచ్చాడు శౌర్య. ఇలా అనేక వివాస్పద వివాదాలు చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్గా ఈ టాలీవుడ్ యంగ్ హీరో మారాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇన్ని వివాదాలకు కేరాఫ్గా మారినా నాగశౌర్యకు మాత్రం ఫ్యాన్ ఫాలోంగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా, ప్రస్తుతం ఈయన నటించి అశ్వథ్థామ చిత్రం హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు.