టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ హీరో విశాల్ కలసి భారీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలకు సౌత్ ఇండస్ట్రీలో భారీ మార్కెట్ ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మ‌హి వి.రాఘ‌వ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో తీసిన 'యాత్ర' సినిమా ఇండస్ట్రీ పరంగా మరియు రాజకీయపరంగా గత ఏడాది సూపర్ డూపర్ హిట్ అయింది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర మెయిన్ లైన్ గా తీసుకుని మ‌హి వి.రాఘ‌వ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్నికల వాతావరణాన్ని ఓటర్ ని వైసీపీ పార్టీకి అనుకూలంగా మార్చింది అని అప్పట్లో రాజకీయ మేధావులు వ్యాఖ్యానించారు.

 

ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 'యాత్ర' సినిమా చూసిన ప్రతి ఒక్కరు వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన గుర్తు తెచ్చుకొని 'యాత్ర' సినిమా కి చాలా ప్రభావితమై వైసీపీ పార్టీకి ఓటింగ్ వేసినట్లు ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి పార్టీ గెలిచిన తర్వాత చాలామంది చెప్పటం జరిగింది. అంతగా ఒక రాజకీయ నాయకుడి సినిమానే ప్రభావితం చేసే విధంగా మ‌హి వి.రాఘ‌వ్ స్క్రీన్ పై అద్భుతంగా చూపించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వైఎస్ అభిమానులు యాత్ర సినిమా డైరెక్టర్ ని పొగడ్తల వర్షం కురిపించారు.

 

అయితే ఆ తర్వాత మళ్లీ మరొక సినిమా చేయని డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ్...తాజాగా నాని మరియు విశాల్ ని హీరోగా పెట్టి భారీ స్థాయిలో దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పని లో మ‌హి వి.రాఘ‌వ్  ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో రావటంతో తెలుగు సినిమా ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: