సాహో తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి గత ఏడాదే ఈ
సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా
ఇటలీ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆతరువాత
సాహో వల్ల ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టాడు ప్రభాస్. ఇక ఇటీవలే ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం కాగా ప్రస్తుతం మూడు షెడ్యూల్ లు కంప్లీట్ అయ్యాయి.
ఇక ఈ చిత్రానికి
జాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేద్దామనుకున్నారు కానీ ఆ టైటిల్ ను శర్వానంద్ అడగడంతో అతనికి ఇచ్చాడు
ప్రభాస్ దాంతో ఇప్పుడు ఈసినిమా కోసం రెండు టైటిల్స్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిందట చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఇంతకీ ఆ టైటిల్స్ ఏంటంటే ఓ డియర్ , రాధే
శ్యామ్ .. అయితే ఈ రెండు టైటిల్ లలో ఏ టైటిల్ ను పెడతారో చూడాలి.
ఒకవేళ తెలుగు ,
తమిళ వెర్షన్ లకు ఓ డియర్ ను పెట్టి
హిందీ వెర్షన్ కు రాధే
శ్యామ్ అనే టైటిల్ ను పెట్టె అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కొద్దీ రోజుల్లో ఈటైటిల్ గురించి క్లారిటీ రానుంది.
జిల్ ఫేమ్
రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో
పూజా హెగ్డే
హీరోయిన్ గా నటిస్తుండగా
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ,
లవర్ ఫేమ్ రిద్దీ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపి
కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైరా ఫేమ్
అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఎలాగైనా ఈఏడాది
దసరా కానుకగా
అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు.