సాహో తరువాత  లాంగ్ గ్యాప్ తీసుకున్న రెబల్ స్టార్  ప్రభాస్  ప్రస్తుతం తన 20వ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ఇటలీ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు.  ఆతరువాత  సాహో వల్ల  ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టాడు ప్రభాస్.  ఇక ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం కాగా ప్రస్తుతం  మూడు షెడ్యూల్ లు కంప్లీట్ అయ్యాయి. 
 
ఇక ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేద్దామనుకున్నారు కానీ  ఆ టైటిల్  ను శర్వానంద్ అడగడంతో  అతనికి ఇచ్చాడు ప్రభాస్ దాంతో ఇప్పుడు ఈసినిమా కోసం రెండు టైటిల్స్ ను  ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిందట చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఇంతకీ ఆ టైటిల్స్ ఏంటంటే ఓ డియర్ , రాధే శ్యామ్ ..   అయితే ఈ రెండు  టైటిల్ లలో ఏ టైటిల్ ను పెడతారో చూడాలి. 
 
ఒకవేళ  తెలుగు , తమిళ వెర్షన్ లకు ఓ డియర్ ను పెట్టి  హిందీ వెర్షన్  కు రాధే శ్యామ్ అనే టైటిల్ ను పెట్టె అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కొద్దీ రోజుల్లో ఈటైటిల్  గురించి  క్లారిటీ రానుంది. జిల్ ఫేమ్  రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ  చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ,లవర్ ఫేమ్ రిద్దీ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.  ఎలాగైనా ఈఏడాది దసరా కానుకగా అక్టోబర్ లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు  తీసుకరావడానికి  సన్నాహాలు  చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: