కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్సకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా దర్బార్. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో రజినీకాంత్, ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించగా ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. నివేత థామస్ రజినీకి కూతరుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటించాడు. ఇక సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో పర్వాలేదనిపించగా, కోలీవుడ్ తమిళ వర్షన్ లో బాగానే ఆడింది. ఇక ఇటీవల తమ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ ని కొల్లగొట్టిందని ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటన కూడా చేసారు. అయితే అందరికీ సడన్ గా షాక్ ఇస్తూ ఈ సినిమా ద్వారా చాలా చోట్ల తమకు నష్టం వచ్చిందని, 

 

ఇటీవల లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ కు వెళ్లిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు, వారిని నిలదీయగా, అప్పుడు అసలు నిజం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు డిస్ట్రిబ్యూటర్ల నిలదీతకు స్పందించిన లైకా సంస్థ నిర్మాతలు, ఈ సినిమా యొక్క దర్శకుడైన మురుగదాస్ కు రూ.60 కోట్ల వరకు తాము చెల్లించడం జరిగిందని, హీరో రజనీకాంత్ తో పాటు తాము కూడా ఆయన రాసుకున్న కథను నమ్మే సినిమా చేయడానికి ముందుకు రావడం జరిగిందని అన్నారట. కావున మీరు ఏదైనా తేల్చుకోవాలంటే ఆయన వద్దకు వెళ్లి తేల్చుకోండి, ఇక్కడ మాకు కూడా రూ.40 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు చెప్పారట నిర్మాతలు. దీనితో దర్శకుడు మురుగదాస్ ని డిస్ట్రిబ్యూటర్లు నిలదీయగా ఆయన నుండి సమాధానం రాకపోగా, తనను పలువురు డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం వేధిస్తున్నారని ఆయన హై కోర్ట్ లో వ్యాజ్యం వేసి పెద్ద షాక్ ఇచ్చారు. 

 

అంతేకాక వారి నుండి తనకు రక్షణ కల్పించాలని కోరడంతో ఆయనకు కోర్ట్ ప్రత్యేక రక్షణ కల్పించినట్లు సమాచారం. అయితే ముందుగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు హీరో రజినికాంత్ ని కలవాలని చూసినప్పటికీ కొన్ని కారణాల వలన అది కుదరలేదని, అందుకే వారు ముందుగా లైకా వారి దగ్గరకు, తరువాత దర్శకుడు మురుగదాస్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రజినీకాంత్ గారే సరైన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. ఈ విషయమై ఏమి జరుగుతుందో రాబోయే రోజుల్లో తెలియనుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: