తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న చిత్రాల జోరు బాగా పెరిపోయాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలకైనా ఓకె కొడతారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్న సినిమా 'అర్ద శతాబ్ధం`. ది డెమోక్రటిక్ వయలెన్స్.. అనేది క్యాప్షన్. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తోనే మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే దీనిపై ఇంత బజ్ రావడానికి గల కారణం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రముఖ దర్శకులు క్రిష్ రిలీజ్ చేయడం.
కాగా, క్రిష్ రిలీజ్ చేసిన 'అర్ద శతాబ్ధం' కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. కాగా, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రస్టింగ్ బజ్ క్రియేట్ చెయ్యడంతో చిత్ర యూనిట్ మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతుందని.. ప్రతి ప్రేక్షకుడి గుండె హత్తుకునేలా సన్నివేశాలు ఉండబోతున్నాయని అన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అష్కర్ సినిమాటోగ్రఫర్గా, నౌఫల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు. జె ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. రెహమాన్ పాటలకు సాహిత్యాన్ని అందించారు. సాయి సతీష్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ మద్య చిన్న సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో మంచి హైప్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మద్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 ఇలా మరికొన్ని చిత్రాలు రిలీజ్ వరకు ఏమీ హడావుడి లేకుండా.. తర్వాత బాక్సాఫీస్ హిట్ అందుకున్నాయి.