ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్కు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మేసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్తో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న రీమేక్ మూవీకి కూడా టైటిల్స్ ఫిక్స్ అయ్యాయి. వీటితో పాటు ప్రభాస్ హీరోగా రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలకు కూడా టైటిల్స్ ఫిక్స్ అయ్యాయి.
చిరంజీవి 151వ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ రీమేక్తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. హిందీలో అమితాబ్బచ్చన్, తమిళ్లో అజిత్ నటించిన క్యారెక్టర్లో పవన్ కనిపించనున్నాడు ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
సాహో తరువాత ప్రభాస్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన కృష్ణంరాజు గోపీ కృష్ణమూవీస్ బ్యానర్పై యూవీ క్రియేషన్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్లో ఒక దాన్ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.
ఈ టైటిల్స్ను చిత్రయూనిట్లు అధికారికంగా వెల్లడించకపోయినా మ్యాట్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆచార్య, ఎస్వీసీ బ్యానర్పై వకీల్ సాబ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఓ డియర్, రాధే శ్యామ్ టైటిల్స్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేశారు. దీంతో చిరు, పవన్, ప్రభాస్ల సినిమాల కోసమే ఈ టైటిల్స్ను రిజిస్టర్ చేశారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.