టాలీవుడ్ లో ఇప్పటికీ ఒక స్టార్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సంవత్సరాలు గ్యాప్ వచ్చినా ఆయన వెనక దర్శక, నిర్మాతలు ఎలా వెంటపడుతున్నారో అందుకు నాలుగింతలు హీరోయిన్స్ ఎగబడుతున్నారు. అందుకే బడా బడా నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అవుతారు. భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పి మారీ పవన్ తో సినిమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ తన రీ-ఎంట్రీలో ఇప్పటి వరకూ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'పింక్' రీమేక్ షూటింగ్ ప్రారంభమై నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతోంది. తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా లాంచ్ అయింది. ఈ సినిమా షూటింగ్ కూడా చక చకా జరుగుతోంది. ఈ సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు మేకర్స్. 

 

ఈ సినిమాల్లో హీరోయిన్లు ఎవరనే విషయంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. పింక్ రీమేక్ లో హీరోయిన్ ప్రాధాన్యత ఏమీ ఉండదనే సంగతి తెలిసిందే. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో నిజానికి హీరోయిజం కూడా ఏమీ ఉండదు. హీరోయిన్ పాత్ర అసలు అవసరమే లేదు. అయితే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మారుస్తున్నారు కాబట్టి ఏదో ఉండాలి కాబట్టి ఒక హీరోయిన్ ను పెట్టాలని చూస్తున్నారు. 

 

ఇక క్రిష్ సినిమా.. హరీష్ శంకర్ సినిమాలకు మాత్రం క్రేజీ హీరోయిన్ల ను ఇప్పటికీ లాక్ చేశారని సమాచారం. క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియడ్ ఫిలిం లో పవన్ కళ్యాణ్ కు జోడీగా కియారా అద్వానిని హీరోయిన్ గా ఎంచుకున్నారని ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా లాక్ చేసినట్టు తాజా సమాచారం. ఈ ఇద్దరూ బ్యూటీలు పవన్ సినిమాలో ఆఫర్ అనగానే పొలో మని బయలుదేరారట. పవర్ స్టార్ తో నటించేందుకు తెగ ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా వయసైపోయిన హీరోలు అందులోను గ్యాప్ తీసుకున్న హీరో సినిమాలకి క్రేజ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ మొహం చాటేస్తారు. కాని పవన్ వయసైపోయినా కూడా ఆయనకి జనాలలో ఉన్న క్రేజ్ తో స్టార్ హీరోయిన్ కూడా ఆయనతో నటించడానికి ఎగబడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: