శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అరుంధతి. ఈ సినిమాతో స్వీటి అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలయిపోయింది. ఒక స్టార్ హీరోకి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ఆ రేంజ్ క్రేజ్ ని అనుష్క దక్కించుకుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం బాగా పాపులారిటిని సంపాదించుకున్న హీరోయిన్ల లిస్టు చూస్తే ఆ లిస్ట్ లో అనుష్క పేరు గ్యారెంటీగా ఉంటుంది. ప్రస్తుతం సౌత్ లో నయనతార తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ స్వీటీ అనుష్క నే. అంతేకాదు అరుంధతి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా కూడా అనుష్క కే సాధ్యమవుతుంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా అనుష్క రేంజ మామూలుగా ఉండదు. అందుకే అనుష్క ఫోటో ఏదైనా సోషల్ మీడియాలో కనిపిస్తే క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

 

అలానే రీసెంట్‌గా స్వీటీ అనుష్క ఒక ఆలయ సందర్శనకు వెళ్ళింది. ఈ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో తెలుపు రంగు చూడిదార్ ధరించి నుదుటన బొట్టుతో ప్రశాంతమైన లుక్ లో దర్శనమిచ్చింది. అనుష్క ఫిజిక్ విషయం ఎలా ఉన్నప్పటికి తన మొహంలో మాత్రం గ్లో ఏమాత్రం తగ్గనే లేదు. ఆకట్టుకునే ముఖారవిందం తో ఎప్పటిలాగానే అందరిని ఆకట్టుకున్నారు. ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఫేస్ లో గ్లో లో ఏమాత్రం తేడా కనిపించలేదని ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటున్నారు. అయితే 'బాహుబలి' సినిమా తర్వాత అనుష్క సినిమాలు రావడం బాగా తగ్గిపోయాయని ఇప్పటి నుంచైనా వెంట వెంటనే సినిమాలు చేస్తే సంతోషిస్తామని ఫ్యాన్స్ అంటున్నారట. 

 

ఇక అనుష్క తాజాగా నటించిన చిత్రం 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్.. అంజలి.. షాలిని పాండే.. మైఖేల్ మ్యాడ్సెన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అనుష్క కెరీర్ లో 'అరుంధతి' లాగా ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందోమో చూడాలి. అయితే కొంతమంది మాత్రం నిశ్శబ్దం ఫ్లాపువుతుందనే ఇలా స్వీటి గుడుల చుట్టూ తిరిగి పూజలు చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: